News April 2, 2025
వరంగల్ మార్కెట్లో చిరుధాన్యాల ధరలు

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో బుధవారం చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ క్వింటా ధర రూ.5,900, పచ్చి పల్లికాయ రూ.4,850 పలికింది. పసుపు (కాడి) క్వింటా ధర రూ.12,359, పసుపు (గోల)కి రూ.10,729 వచ్చింది. మరోవైపు మక్కలు (బిల్టీ) క్వింటా ధర రూ.2,285 పలికినట్లు అధికారులు వెల్లడించారు.
Similar News
News December 1, 2025
NTR: రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య గమనిక

రెవెన్యూ శాఖలో పనిచేసి రిటైర్డ్ అయిన ఉద్యోగులను అమరావతి భూసమీకరణ విధులలో భాగం చేసేందుకు CRDA సన్నద్ధమైంది. CRDAలో డిప్యూటీ కలెక్టర్లు(7), తహశీల్దార్(5), డిప్యూటీ తహశీల్దార్(5) ఉద్యోగాలకు రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు DEC 2లోపు దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ కె.కన్నబాబు సూచించారు. వివరాలకు https://crda.ap.gov.in/ చూడాలని, ఇదే వెబ్సైట్లోని కెరీర్స్ ట్యాబ్లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News December 1, 2025
GNT: ‘HIV పై తప్పక అవగాహన కలిగి ఉండాలి’

గుంటూరు జిల్లాలో ప్రజలకు ఉచిత HIV పరీక్షలు, సూచనలు ఇచ్చేందుకు 10 కౌన్సిలింగ్, పరీక్షా కేంద్రాలు (Standalone ICTCs), ప్రభుత్వ ఆసుపత్రులలో, 27 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో , 47 పట్టణ ఆరోగ్య కేంద్రాలలో ఏర్పాటు చేశారు. జిల్లాలో HIVతో జీవిస్తున్న వారికి NTR పెన్షన్ కింద రూ. 4,000 చొప్పున 2,634 మందికి అందిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా, ప్రజలు HIV పై తప్పక అవగాహన కలిగి ఉండాలి.
News December 1, 2025
కృష్ణా జిల్లాలో యధావిధిగానే పాఠశాలలు: డీఈఓ

కృష్ణాజిల్లాలో సోమవారం యధావిధిగా పాఠశాలలు కొనసాగుతాయని డీఈఓ రామారావు తెలిపారు. దిత్వా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో ఇప్పటి వరకు భారీ వర్షాలు పడని కారణంగా పాఠశాలలను యధావిధిగా కొనసాగిస్తున్నామన్నారు. భారీ వర్షాలు పడితే కలెక్టర్ ఆదేశాల మేరకు ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. తీర ప్రాంత మండలాల్లో అక్కడి పరిస్థితులను బట్టి తహశీల్దార్లు స్కూల్స్ శెలవుపై నిర్ణయం తీసుకుంటారన్నారు.


