News April 2, 2025
వరంగల్ మార్కెట్లో చిరుధాన్యాల ధరలు

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో బుధవారం చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ క్వింటా ధర రూ.5,900, పచ్చి పల్లికాయ రూ.4,850 పలికింది. పసుపు (కాడి) క్వింటా ధర రూ.12,359, పసుపు (గోల)కి రూ.10,729 వచ్చింది. మరోవైపు మక్కలు (బిల్టీ) క్వింటా ధర రూ.2,285 పలికినట్లు అధికారులు వెల్లడించారు.
Similar News
News November 18, 2025
వేడెక్కిన కడియం శ్రీహరి రాజీనామా టాక్..!

ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టేషన్ఘన్పూర్ MLA కడియం శ్రీహరి రాజకీయాల్లో తన క్లీన్ ఇమేజ్ కాపాడుకోవాలనే నిశ్చయంతో ఉన్నారనే టాక్ నడుస్తోంది. స్పీకర్ ఇచ్చిన నోటీసులకు స్పందించకపోవడం, అధిష్టానం సూచిస్తే రాజీనామా చేసి ఉపఎన్నికకు వెళ్లేందుకు సిద్ధమని ఆయన సంకేతాలిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఫిరాయింపు అపవాదుతో కొనసాగే బదులు నేరుగా ప్రజాతీర్పు కోరాలని భావిస్తున్నట్లు సమాచారం.
News November 18, 2025
సతీశ్ మృతి కేసు.. కీలకంగా ఫోన్ డేటా!

AP: టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీశ్ మృతి కేసు దర్యాప్తులో ఆయన ఫోన్లోని సమాచారం కీలకంగా మారింది. ఫోన్ ధ్వంసమవడంతో ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. పరకామణి చోరీ కేసులో ఈ నెల 6న విచారణకు హాజరైన సతీశ్ 13న అనుమానాస్పద స్థితిలో మరణించారు. దీంతో ఆ రెండు తేదీల మధ్య ఆయన ఎవరెవరితో మాట్లాడారో తెలుసుకునేందుకు మెసేజ్లు, వాట్సాప్ కాల్స్, ఇంటర్నెట్ కాల్స్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు.
News November 18, 2025
వేడెక్కిన కడియం శ్రీహరి రాజీనామా టాక్..!

ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టేషన్ఘన్పూర్ MLA కడియం శ్రీహరి రాజకీయాల్లో తన క్లీన్ ఇమేజ్ కాపాడుకోవాలనే నిశ్చయంతో ఉన్నారనే టాక్ నడుస్తోంది. స్పీకర్ ఇచ్చిన నోటీసులకు స్పందించకపోవడం, అధిష్టానం సూచిస్తే రాజీనామా చేసి ఉపఎన్నికకు వెళ్లేందుకు సిద్ధమని ఆయన సంకేతాలిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఫిరాయింపు అపవాదుతో కొనసాగే బదులు నేరుగా ప్రజాతీర్పు కోరాలని భావిస్తున్నట్లు సమాచారం.


