News August 29, 2024
వరంగల్ మార్కెట్లో చిరు ధాన్యాల ధరలు ఇలా

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈరోజు వివిధ రకాల చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ ధర రూ.5,910 పలకగా పచ్చి పల్లికాయ ధర రూ.3500 పలికింది. మరోవైపు పసుపు కి రూ.11,885 ధర రాగా, 5531 రకం మిర్చికి నిన్న రూ.13,500, టమాటా రకం మిర్చికి రూ.19 వేల ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.
Similar News
News December 19, 2025
వరంగల్ జిల్లాలో సాగు వివరాలు..!

జిల్లాలో యాసంగి సీజన్ ప్రారంభమైంది. 2025-26 యాసంగి పంటల సాగు, విత్తనాలు, ఎరువుల లభ్యతపై కలెక్టర్
సత్య శారద సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం మొక్కజొన్న 26,510 ఎకరాలు, కూరగాయలు తదితర ఉద్యాన పంటలు 6,877 ఎకరాల్లో సాగవుతున్నాయి. వరి పంట 1,15,200 ఎకరాల సాగు అంచనాతో 23,040 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. మొక్కజొన్న 1,08,500 ఎకరాల అంచనాకు 8,680 క్వింటాళ్ల విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి.
News December 18, 2025
వరంగల్ జిల్లాలో సింగిల్ డిజిట్లో గెలిచిన అభ్యర్థులు!

నర్సంపేట మండలం జీజీఆర్పల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి భూస నరసయ్య ఒక్క ఓటు తేడాతో గెలిచారు. 453 ఓట్లకు గాను 421 పోలై నరసయ్యకు 191, BRS అభ్యర్థి కుమారస్వామికి 190 ఓట్లు వచ్చాయి. ఖానాపురం మండలం అయోధ్యనగర్లో BRS అభ్యర్థి కూస విమల నాలుగు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నెక్కొండ మండలం మడిపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి ఆంగోత్ అనూష, అజ్మీరా మంగ్యానాయక్ తండాలో BRSఅభ్యర్థి మాలోత్ వెంకట్ స్వల్ప మెజార్టీతో గెలిచారు.
News December 17, 2025
గొల్లభామ తండా సర్పంచ్గా బాలు నాయక్

చెన్నారావుపేట మండలంలోని గొల్లభామ తండా గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన గుగులోతు బాలు నాయక్ విజయం సాధించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రజలతో కలిసి ముందుకు సాగుతానని, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


