News January 2, 2025

వరంగల్ మార్కెట్‌లో చిరు ధాన్యాల ధరలు ఇలా..

image

వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు గురువారం వివిధ రకాల చిరు ధాన్యాలు తరలి రాగా ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ క్వింటాకు రూ.7,200 ధర పలకగా, పచ్చి పల్లికాయ రూ.4,680 ధర పలికింది. అలాగే పసుపు క్వింటాకు రూ.11,329 ధర పలికింది. కాగా మంగళవారంతో పోలిస్తే పల్లికాయ ధరలు పెరగగా పసుపు ధర స్వల్పంగా తగ్గింది.

Similar News

News January 24, 2025

దరఖాస్తులను వెంటనే ఆన్లైన్‌లో ఎంట్రీ చేయాలి: కలెక్టర్ 

image

సంగెం మండల తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాన్ని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులపై వచ్చిన దరఖాస్తులను ఎంట్రీ ప్రక్రియను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. దరఖాస్తులను ఎప్పటికప్పుడు తప్పులు దొర్లకుండా ఆన్లైన్ ఎంట్రీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

News January 23, 2025

వరంగల్ మార్కెట్‌కి అరుదైన మిర్చి ఉత్పత్తుల రాక

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో వివిధ రకాల అరుదైన మిర్చి ఉత్పత్తులు తరలివచ్చాయి. ఎల్లో మిర్చి క్వింటా రూ.18 వేలు, 2043 రకం మిర్చి రూ.14 వేలు, 273 రకం మిర్చి రూ. 12వేలు, హరిణి మిర్చి రూ.14 వేలు, అకిరా బ్యాగడి మిర్చి రూ.13 వేలు పలికింది.అలాగే పాత తేజా మిర్చి ధర రూ.13,300, పాత 341 రకం మిర్చి ధర రూ.14,300, పాత వండర్ హాట్ మిర్చి రూ.13,600, 5531 మిర్చి రూ.12 వేల ధర పలికినట్లు అధికారులు పేర్కొన్నారు.

News January 22, 2025

మట్టెవాడ: విద్యార్థినులకు పలు అంశాలపై అవగాహన సదస్సు

image

మత్తు పదార్థాల వినియోగం, విక్రయాలపై మట్టెవాడలోని ఓ కళాశాలలో విద్యార్థినులకు పోలీసులు అవగాహన కల్పించారు. వీటితో పాటు సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు, ర్యాగింగ్, షీ టీం పోలీసుల పనితీరు గురించి వివరించారు. పోలీసులను ఎలా సంప్రదించాలి, ఎలా ఫిర్యాదు చేయాలి తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు పాల్గొన్నారు.