News February 4, 2025
వరంగల్ మార్కెట్లో తగ్గిన పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే మంగళవారం పత్తి ధర తగ్గింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,000 పలకగా.. నేడు రూ.40 తగ్గి, రూ.6,960 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. పత్తి ధర తగ్గడంతో రైతన్నలు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ధరలు పెరిగేలా అధికారులు, వ్యాపారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News October 15, 2025
MNCL: కొడుకు మృతి.. తట్టుకోలేక ఫ్యామిలీ సూసైడ్

అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడి మృతి తట్టుకోలేక కుటుంబీకులంతా ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన మంచిర్యాలలో జరిగింది. రాజీవ్ నగర్లో ఆటో డ్రైవర్ చక్రవర్తి కుమారుడు పవన్ 2నెలల క్రితం జ్వరంతో మృతిచెందాడు. దీంతో మనస్తాపం చెందిన కుటుంబీకులు ఈ నెల 5న పురుగుమందు తాగారు. ఈ నెల 9 అతడి భార్య దివ్య, 11న కూతురు దీక్షిత మృతి చెందగా బుధవారం చక్రవర్తి చనిపోయాడు.
News October 15, 2025
JGTL: కనీస మద్దతు ధరల గోడ పత్రిక ఆవిష్కరణ

పండించిన పంటలకు రైతులు కనీస మద్దతు ధర పొందేలా కృషి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్ల కనీస మద్దతు ధరల గోడ పత్రికను ఆయన బుధవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి.ఎస్ లత, ట్రైనీ అదనపు కలెక్టర్ కన్నం హరిణి, డీఆర్డీవో రఘువరన్, డీసీవో మనోజ్ కుమార్, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, ఆర్టివో, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
News October 15, 2025
వ్యాపార నిర్వహణలో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్!

ఫార్చ్యూన్-2025 ప్రకారం వ్యాపార నిర్వహణలో NVIDIA వ్యవస్థాపకుడు జెన్సెన్ హువాంగ్(US) వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్గా నిలిచారు. మైక్రోసాఫ్ట్ CEO సత్యనాదెళ్ల, మెటా CEO మార్క్ జుకర్బర్గ్, టెస్లా CEO ఎలాన్ మస్క్ టాప్-4లో ఉన్నారు. తర్వాతి స్థానాల్లో వాంగ్ చువాన్ఫు, సుందర్ పిచాయ్(గూగుల్), రెన్ జెంగ్ఫీ, సామ్ ఆల్ట్మాన్, జామీ డిమోన్, మేరీ బార్రా ఉన్నారు. టాప్-20లో ఇండియన్స్ ఒక్కరూ లేకపోవడం గమనార్హం.