News February 4, 2025
వరంగల్ మార్కెట్లో తగ్గిన పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే మంగళవారం పత్తి ధర తగ్గింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,000 పలకగా.. నేడు రూ.40 తగ్గి, రూ.6,960 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. పత్తి ధర తగ్గడంతో రైతన్నలు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ధరలు పెరిగేలా అధికారులు, వ్యాపారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News February 14, 2026
ఆ బౌలర్తో జాగ్రత్త.. భారత బ్యాటర్లకు మాజీల సూచన

రేపు పాక్తో మ్యాచులో సైడ్ ఆర్మ్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ను ఎదుర్కోవడం భారత బ్యాటర్లకు సవాలుగా మారే అవకాశముంది. ఆయన బౌలింగ్లో జాగ్రత్తగా ఆడాలని టీమ్ఇండియాకు హర్భజన్ సింగ్ సూచించారు. ఈ మ్యాచులో INDదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. తారిఖ్ బాల్ను ఆగి వేస్తుండడంతో విమర్శలొస్తున్న సంగతి తెలిసిందే. అతడు అలా ఆగినప్పుడు భారత బ్యాటర్లు పక్కకు తప్పుకోవచ్చని స్పిన్నర్ అశ్విన్ సలహా ఇచ్చారు.
News February 14, 2026
RR: ఇద్దరికి సున్నా.. వారి ఓటెవరికి వేసినట్లు?

RR మున్సిపల్ ఫలితాల్లో ఆసక్తికర ఘటనలు. చేవెళ్ల 5th వార్డులో TRP అభ్యర్థి రాజుకు ఒక్క ఓటూ పడలేదు. తన ఓటు తానూ వేసుకోకపోవడం గమనార్హం. 1st వార్డులో BJP అభ్యర్థి శ్రీనివాస్కు 2ఓట్లు రాగా 4వవార్డు BJP అభ్యర్థి కేశపల్లి భాగ్యమ్మకు 2ఓట్లు వచ్చాయి. ఇబ్రహీంపట్నంలో 2nd వార్డ్లో అలీకి ఓట్లురాలేదు. 19thవార్డులో BSP అభ్యర్థి రఘుపతికి 1ఓటు పడింది. శంకర్పల్లిలో 13వవార్డు జనసేన అభ్యర్థి సాయికి 2ఓట్లు పడ్డాయి.
News February 14, 2026
పాలమూరు పురపోరు.. కాంగ్రెస్ ఏకపక్ష విజయం!

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్నికలు జరిగిన MBNR కార్పొరేషన్లో 60 డివిజన్లు, 18 మున్సిపాలిటీలలో 316 వార్డులు ఉండగా..
కాంగ్రెస్ 30 డివిజన్లు, 179 వార్డులు,
BRS 15 డివిజన్లు, 75 వార్డులు,
BJP 7 డివిజన్లు, 38 వార్డులు,
AIFB 9(W),
MIM 6(W),
ఇండిపెండెంట్లు 9(W),
CPM రెండు స్థానాలు గెలుపొందాయి.
మక్తల్ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడంతో ఎన్నిక వాయిదా పడింది.


