News February 4, 2025

వరంగల్ మార్కెట్లో తగ్గిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారంతో పోలీస్తే ఈరోజు వివిధ రకాల మిర్చి ధరలు తగ్గాయి. సోమవారం క్వింటా తేజ మిర్చి ధర రూ. 13,900 పలకగా నేడు రూ.13,500 పలికింది. అలాగే 341 రకం మిర్చికి నిన్న రూ.14,500 పలకగా ఈరోజు రూ.14,200కి పడిపోయింది. మరోవైపు వండర్ హాట్ (WH) మిర్చికి నిన్న రూ.14,800 ధర రాగా.. నేడు రూ.15వేలకు చేరింది.

Similar News

News November 24, 2025

ముగిసిన జీ20 సమ్మిట్.. తిరుగు పయనమైన మోదీ

image

సౌతాఫ్రికా వేదికగా జరిగిన జీ20 సమ్మిట్ ముగిసింది. దీంతో ప్రధాని మోదీ భారత్‌కు తిరుగు పయనమయ్యారు. సదస్సు విజయవంతగా ముగిసిందని ఆయన ట్వీట్ చేశారు. వివిధ దేశాధినేతలతో ఫలప్రదమైన చర్చలు జరిగినట్లు పేర్కొన్నారు. సమ్మిట్ చివరిరోజు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో మోదీ భేటీ అయ్యారు. ఉగ్రవాదానికి నిధులు అందకుండా అడ్డుకోవడానికి ఇరుదేశాలు ఉమ్మడిగా పోరాడాలని ఈ సమావేశంలో నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.

News November 24, 2025

విభూది ఎందుకు ధరించాలి?

image

పరమ శివుడికి విభూది అంటే చాలా ఇష్టం. దీన్నే భస్మం అని కూడా అంటారు. భస్మం మన పాపాలను ప్రక్షాళన చేస్తుందని నమ్ముతారు. హోమంలో భగవంతునికి సమర్పించిన గంధపు చెక్కలు, నెయ్యి, ఇతర ఔషధాల నుంచి భస్మం తయారవుతుంది. దీన్ని ధరిస్తే.. జనన మరణ పరిధుల నుంచి బయటపడతామని, అహంకారం అంతమవుతుందని నమ్ముతారు. అలాగే ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని పండితులు చెబుతున్నారు. ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

News November 24, 2025

నేటి నుంచి రాష్ట్రంలో ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమం

image

AP: వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి 29వ తేదీ వరకు ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమాన్ని చేపట్టనుంది. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్ధతు అనే అంశాలతో ప్రభుత్వం పంచ సూత్రాల విధానాన్ని ప్రవేశపెట్టింది. వీటి అమలుతో సాగులో కలిగే మేలుపై రైతుల ఇళ్లకు వెళ్లి ప్రజాప్రతినిధులు, వ్యవసాయ, ఆక్వా, ఉద్యాన అధికారులు వివరించనున్నారు.