News February 4, 2025

వరంగల్ మార్కెట్లో తగ్గిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారంతో పోలీస్తే ఈరోజు వివిధ రకాల మిర్చి ధరలు తగ్గాయి. సోమవారం క్వింటా తేజ మిర్చి ధర రూ. 13,900 పలకగా నేడు రూ.13,500 పలికింది. అలాగే 341 రకం మిర్చికి నిన్న రూ.14,500 పలకగా ఈరోజు రూ.14,200కి పడిపోయింది. మరోవైపు వండర్ హాట్ (WH) మిర్చికి నిన్న రూ.14,800 ధర రాగా.. నేడు రూ.15వేలకు చేరింది.

Similar News

News February 18, 2026

25,487పోస్టులు.. పరీక్ష వాయిదా

image

CAPFS, SSF, అస్సాం రైఫిల్స్‌లో ఖాళీగా ఉన్న 25, 487 కానిస్టేబుల్ (<>GD<<>>) పోస్టుల భర్తీకి సంబంధించి ఫిబ్రవరి 23న పరీక్ష జరగాల్సి ఉండగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాయిదా వేసింది. త్వరలో పరీక్ష తేదీలను ప్రకటించనున్నట్లు వెల్లడించింది. పరీక్షకు 8/10రోజుల ముందు సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు, 2/3రోజుల ముందు అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది. వెబ్‌సైట్: https://ssc.gov.in/

News February 18, 2026

భారీగా పెరిగిన అరటి ధరలు.. గెల ఎంతంటే?

image

AP: అరటి ధరలకు రెక్కలొచ్చాయి. JAN వరకు కర్పూర చక్కెరకేళి, తెల్ల చక్కెరకేళి, ఎర్ర చక్కెరకేళి గెల ₹200-300 ఉండేది. ఇప్పుడు ₹700-1000కి పెరిగింది. ఏప్రిల్ వరకు ఇవే ధరలు ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. ఉమ్మడి తూ.గో, ప.గో జిల్లాల్లో అరటిని ఎక్కువగా సాగు చేస్తారు. గత 3ఏళ్లుగా తక్కువ ధరలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టాలు రావడంతో సాగు విస్తీర్ణం తగ్గింది. డిమాండ్‌కు తగ్గట్లు అరటి మార్కెట్లోకి రావట్లేదు.

News February 18, 2026

కేంద్రీయ విద్యాలయంలో పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

నెల్లూరు రూరల్‌లోని కేంద్రీయ విద్యాలయంలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పలు పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ దొరసానమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. టీచర్, కార్యాలయ సిబ్బంది పోస్టులకు అర్హులైన వారు kothuru.kvs.ac.in లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇంటర్వ్యూలను ఈ నెల 23, 24న తేదీల్లో నిర్వహించనున్నామని చెప్పారు.