News February 17, 2025

వరంగల్ మార్కెట్‌లో తగ్గిన పత్తి ధర

image

రెండు రోజుల సాధారణ సెలవుల అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఈరోజు పునః ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్‌కు పత్తి తరలి రాగా ధర మాత్రం గతవారంతో పోలిస్తే భారీగా తగ్గింది. గతవారం మొదట్లో క్వింటా పత్తి ధర రూ.7,060 పలకగా.. శుక్రవారం రూ.6,820కి చేరింది. ఈరోజు మరింత తగ్గి రూ.6,800కి పడిపోయినట్లు వ్యాపారులు తెలిపారు.

Similar News

News November 11, 2025

మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఎంతంటే?

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 31.94% పోలింగ్ మాత్రమే నమోదైంది. చాలామంది ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో కొన్ని పోలింగ్ కేంద్రాలు వెలవెలబోతున్నాయి. రాజ్యాంగం కల్పించిన హక్కును సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఏ అభ్యర్థీ నచ్చకపోతే నోటాకు కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు.

News November 11, 2025

NGKL: రాజ్ మార్గమే రాజమార్గం- SP

image

లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవలని నాగర్‌కర్నూల్‌ ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రంగనాథ్ సూచించారు. ఈనెల 15న శనివారం జిల్లాలోని అన్ని కోర్టుల్లో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. రాజీపడదగిన సివిల్, క్రిమినల్ కేసులను ఇరువర్గాల అంగీకారంతో పరిష్కరించుకోవచ్చని సూచించారు. “రాజీ మార్గమే రాజమార్గం” అని పేర్కొంటూ, కేసులను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.

News November 11, 2025

రక్షణ చట్టం వచ్చేవరకు మా అడుగులు ఆగవు- న్యాయవాదుల

image

న్యాయవాదుల భద్రత దేశ న్యాయవ్యవస్థ గౌరవానికి మూలం. రక్షణ చట్టం అమలు అయ్యే వరకు మా అడుగులు ఆగవు అని న్యాయవాద సంఘ నేతలు స్పష్టం చేశారు. మంగళవారం గవ్వల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ‘న్యాయవాదుల రక్షణ – చలో హైదరాబాద్’ పాదయాత్ర మూడో రోజు బీచుపల్లి శ్రీరామాలయం ప్రాంగణంలో ప్రార్థనలతో ప్రారంభమైంది. ‘న్యాయవాది రక్షణ చట్టం – ఇప్పుడే అమలు చేయాలి’ అంటూ పెద్ద సంఖ్యలో నినాదాలు చేశారు.