News February 17, 2025
వరంగల్ మార్కెట్లో తగ్గిన పత్తి ధర

రెండు రోజుల సాధారణ సెలవుల అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఈరోజు పునః ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్కు పత్తి తరలి రాగా ధర మాత్రం గతవారంతో పోలిస్తే భారీగా తగ్గింది. గతవారం మొదట్లో క్వింటా పత్తి ధర రూ.7,060 పలకగా.. శుక్రవారం రూ.6,820కి చేరింది. ఈరోజు మరింత తగ్గి రూ.6,800కి పడిపోయినట్లు వ్యాపారులు తెలిపారు.
Similar News
News November 25, 2025
HZB: పేదలకు మెరుగైన వైద్యం అందజేయాలి: బండి

కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సోమవారం హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి సందర్శించారు. సుమారు కోటిన్నర రూపాయల విలువైన ఆధునిక వైద్య పరికరాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
News November 25, 2025
KNR: భవన నిర్మాణ కార్మికులకు అవగాహన సదస్సులు

భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై పది రోజుల పాటు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఉప కార్మిక కమిషనర్ తెలిపారు. లేబర్ కమిషనర్ హైదరాబాద్ ఆదేశాల మేరకు డిసెంబర్ 3 వరకు ఈ సదస్సులు జరుగుతాయి. ప్రమాద బీమా, సహజ మరణం, పెళ్లి కానుక, ప్రసూతి లబ్ధి వంటి అంశాలపై నిర్వహించే ఈ సదస్సులను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News November 25, 2025
ఈనెల 26న జిల్లా అధికారుల సమీక్ష: కలెక్టర్

జిల్లా సమీక్షా సమావేశాన్ని ఈనెల 26న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన నిర్వహించనున్నట్లు ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వి సోమవారం తెలిపారు. ఈ సమావేశంలో ధాన్యం కొనుగోలు, గృహ నిర్మాణం, 22A కేసులు, ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సీఐఐ సమ్మిట్ తదితర అంశాలపై సమీక్షిస్తారన్నారు. జిల్లాకు సంబంధించిన నాయకులు, ప్రతినిధులు, అధికారులు పాల్గొంటారన్నారు.


