News February 17, 2025

వరంగల్ మార్కెట్‌లో తగ్గిన పత్తి ధర

image

రెండు రోజుల సాధారణ సెలవుల అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఈరోజు పునః ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్‌కు పత్తి తరలి రాగా ధర మాత్రం గతవారంతో పోలిస్తే భారీగా తగ్గింది. గతవారం మొదట్లో క్వింటా పత్తి ధర రూ.7,060 పలకగా.. శుక్రవారం రూ.6,820కి చేరింది. ఈరోజు మరింత తగ్గి రూ.6,800కి పడిపోయినట్లు వ్యాపారులు తెలిపారు.

Similar News

News October 19, 2025

కులాంతర వివాహం.. 20 మందికి రూ.2.50 లక్షల చొప్పున

image

జనగామ: కులాంతర వివాహం చేసుకున్న వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రోత్సాహకం కింద రూ.2.50 లక్షలు అందజేస్తున్నాయి. మంజూరైన ఈ ప్రోత్సాహక నిధులను దంపతుల జాయింట్ అకౌంట్‌లో మూడేళ్లపాటు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తారు. ఈ పథకం కింద జనగామ జిల్లాలో 2019 నుంచి ఇప్పటివరకు 20 మంది దంపతులకు ప్రోత్సాహకం అందినట్లు అధికారులు తెలిపారు. ఇంకా 70 మందికి పైగా లబ్ధిదారులకు ఈ ప్రోత్సాహకం అందాల్సి ఉందని పేర్కొన్నారు.

News October 19, 2025

CM రాక.. బోనంతో స్వాగతం

image

ఎన్టీఆర్ స్టేడియం వద్ద శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్‌‌ ఆదివారం వైభవంగా సాగింది. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఈ వేడుకలో CM రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లోయర్‌ ట్యాంక్‌బండ్‌ నుంచి ధర్నాచౌక్‌ ప్రాంగణానికి చేరుకున్న ఆయన కాన్వాయ్‌ డోర్ ఓపెన్ చేసి మహిళా కళాకారులకు అభివాదం చేశారు. నెత్తిన బోనం ఎత్తుకొని నృత్యాలు చేస్తున్న కళాకారుల్లో CMని చూసి ఉత్సాహం మరింత పెరిగింది.

News October 19, 2025

పెద్దపల్లి: ‘యాదవులను సంఘటితం చేస్తాం’

image

రాజకీయాలను శాసించే స్థాయికి యాదవులను సంఘటితం చేస్తామని ఉమ్మడి కరీంనగర్ యాదవ సంఘాల కన్వీనర్‌ సౌగాని కొమురయ్య అన్నారు. ఆదివారం పెద్దపల్లి ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. జనాభా పరంగా 22శాతం యాదవులున్నారని, కానీ రాజకీయ అవకాశాలు మాత్రం ఆ స్థాయిలో లభించడం లేదన్నారు. ఈనెల 24న KNR వద్ద యాదవులకు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు సౌగాని తెలిపారు. దీనిని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.