News March 6, 2025
వరంగల్ మార్కెట్లో తటస్థంగా పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధరలో ఎలాంటి మార్పు లేదు. సోమవారం క్వింటా పత్తి ధర రూ.6,880 పలకగా.. మంగళవారం రూ.6,920 పలికింది. బుధవారం స్వల్పంగా తగ్గి రూ.6,900కి చేరింది. అయితే గురువారం సైతం రూ.6,900 పలికినట్లు మార్కెట్ వ్యాపారులు తెలిపారు. అయితే పత్తి ధరలు పెరగకపోవడంతో రైతన్నలు నిరాశ చెందుతున్నారు.
Similar News
News November 14, 2025
హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు: ఎస్పీ

ఎల్.కోట మండలం రేగలో 2021లో భూతగాదాల వివాదంతో హత్య జరిగింది. ఈ కేసులో ముగ్గురి నిందితులకు జీవిత ఖైదుతో పాటు రూ.3వేల చొప్పున జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత తీర్పు ఇచ్చారని SP దామోదర్ తెలిపారు. ఈశ్వరరావు అనే వ్యక్తిని కర్రలతో దాడి చేసి చంపినట్టు నేరం రుజువైనందున విశ్వనాథం, దేముడమ్మ, లక్ష్మిలకు శిక్ష విధించారని వెల్లడించారు. ఏ1గా ఉన్న నిందితుడు అప్పారావు విచారణలో మృతి చెందాడన్నారు.
News November 14, 2025
పిల్లల ఎదుగుదలపై దృష్టి పెట్టాలి: దీపక్ తివారీ

పిల్లల ఎదుగుదల, ప్రవర్తనపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అదనపు కలెక్టర్, ఇన్చార్జి విద్యాధికారి దీపక్ తివారీ అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి, బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. పిల్లల ప్రవర్తన, ఎదుగుదలలో తల్లిదండ్రుల పాత్ర ముఖ్యమని తెలిపారు.
News November 14, 2025
అడిషనల్ జడ్జ్గా క్షమా దేశ్పాండే బాధ్యతలు

వరంగల్ జిల్లాకు SPE, ఏసీబీ(ACB) కేసుల స్పెషల్ కోర్టులో అడిషనల్ జిల్లా, సెషన్స్ జడ్జ్గా బాధ్యతలు చేపట్టిన క్షమా దేశ్పాండేను తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు డి.మురళీధర్ రెడ్డి, ప్రస్తుత అధ్యక్షుడు ఆకారం శ్రీనివాస్ కుమార్, కోశాధికారి రాజేశ్ కుమార్ తదితరులు పుష్పగుచ్ఛం అందించి అభినందించారు.


