News March 6, 2025

వరంగల్ మార్కెట్లో తటస్థంగా పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధరలో ఎలాంటి మార్పు లేదు. సోమవారం క్వింటా పత్తి ధర రూ.6,880 పలకగా.. మంగళవారం రూ.6,920 పలికింది. బుధవారం స్వల్పంగా తగ్గి రూ.6,900కి చేరింది. అయితే గురువారం సైతం రూ.6,900 పలికినట్లు మార్కెట్ వ్యాపారులు తెలిపారు. అయితే పత్తి ధరలు పెరగకపోవడంతో రైతన్నలు నిరాశ చెందుతున్నారు.

Similar News

News October 24, 2025

రహదారి ప్రమాదాల నియంత్రణకు చర్యలు: ఎస్పీ మాధవరెడ్డి

image

భామిని మండలం బత్తిలి పోలీస్ స్టేషన్‌లో పార్వతీపురం ఎస్పీ మాధవరెడ్డి శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా రహదారి ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాలసిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. కంప్యూటర్ సిబ్బంది కేసు ప్రాపర్టీ గదులను తనిఖీ చేసి భద్రతపై పలు సూచనలు అందించారు. కేసులు వివరాలు, దర్యాప్తు పెండింగ్ కేసులు పూర్తి చేయాలని సూచించారు.

News October 24, 2025

ఉపాధ్యాయులను ఇంటర్వ్యూ చేసిన కలెక్టర్

image

విదేశీ విద్యా విధానం ఆధ్యయానికి దరఖాస్తులు చేసుకున్న ఉపాధ్యాయులకు శుక్రవారం కలెక్టర్ అభిలాష అభినవ్ ఇంటర్వ్యూ నిర్వహించారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు జిల్లాలోని ఉపాధ్యాయులను విదేశీ విద్యా విధానాలు పరిశీలించేందుకు ఆసక్తి గల ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యా విధానాన్ని అధ్యయనం చేసి ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు కార్యక్రమం చేపడుతున్నామన్నారు.

News October 24, 2025

గుర్తింపు ఫీజు, హరిత నిధి చెల్లించాలి: డీఐఈఓ

image

జిల్లాలోని ప్రభుత్వ రంగ, ప్రైవేటు జూనియర్ కళాశాలలు గుర్తింపు ఫీజు చెల్లించాలని DIEO శ్రీధర్ సుమన్ అన్నారు. ఇంటర్ బోర్డు వెబ్ సైట్‌లో సంబంధిత కాలేజ్ లాగిన్ ద్వారా “రికగ్నైజేషన్ ఫీజు” తప్పక చెల్లించాలని, విద్యార్థుల పూర్తి వివరాలను “ఆన్ లైన్ చెక్ లిస్టు”లతో సరి చూసుకోవాలని DIEO సూచించారు.