News February 6, 2025
వరంగల్: మార్కెట్లో ధరల వివరాలు..

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం వివిధ రకాల మిర్చి ఉత్పత్తులు రాగా.. ధరలు ఇలా ఉన్నాయి. 5531 మిర్చి రూ.10,500 పలకగా.. అకిరా బ్యాగడి మిర్చి రూ.11వేలు, ఎల్లో మిర్చి రూ.18 వేలు ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. అలాగే 2043 రకం మిర్చి రూ.14 వేలు, 334 మిర్చి రూ.13వేలు ధర వచ్చింది. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
Similar News
News December 9, 2025
పెళ్లి రద్దు చేసుకున్న హీరోయిన్?

వ్యాపారవేత్త రాజ్హిత్ ఇబ్రాన్తో హీరోయిన్ నివేదా పేతురాజ్ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వీరి వివాహం రద్దయినట్లు ప్రచారం జరుగుతోంది. తన ఇన్స్టా అకౌంట్ నుంచి ఎంగేజ్మెంట్ పోస్ట్ను తొలగించడం, ఇద్దరూ ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఇటీవలే క్రికెటర్ స్మృతి మంధాన వివాహం కూడా ఎంగేజ్మెంట్ తర్వాత రద్దయింది.
News December 9, 2025
వాజ్పేయి పాలసీలతో అభివృద్ధికి పునాది: CM

AP: ఈనెల 11-25 మధ్య జరిగే ‘అటల్ సందేశ్.. మోదీ సుపరిపాలన యాత్ర’లో కూటమి నేతలంతా పాల్గొనాలని CM CBN సూచించారు. వాజ్పేయి సుపరిపాలనకు నాంది పలికారని, ఆయన పాలసీలతోనే దేశాభివృద్ధికి పునాది పడిందని చెప్పారు. రోడ్లు, విమానయాన, టెలీ కమ్యూనికేషన్ రంగాల్లో సంస్కరణలు తెచ్చారన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి వెంటనే స్పందించేవారన్నారు. PM మోదీ దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు.
News December 9, 2025
కోనసీమ: లంచం అడిగితే.. ఈ నంబర్లకు కాల్ చేయండి.!

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేసినా, అవినీతికి పాల్పడినట్లు తెలిసినా, ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని ACB అధికారులు కోరుతున్నారు. ACB DSP 9440446160, సీఐలు 9440446161, 8332971041, టోల్ ఫ్రీ 1064కు ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు. కాగా నేడు అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం. ప్రజల్లో చైతన్యం రావాలని సూచించారు.


