News August 14, 2024
వరంగల్: మార్కెట్లో నేటి పత్తి ధర రూ.7150

ఎనుమాముల మార్కెట్లో పత్తి గరిష్ఠంగా రూ.7150 లు పలికింది. రూ.5000-6500 వరకు పత్తి నాణ్యతను బట్టి వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్నారు. మొత్తంగా బుధవారం మార్కెట్కు 150 పత్తి బ్యాగులు వచ్చినట్లు మార్కెట్ వ్యాపారస్తులు, మార్కెట్ కమిటీ వారు తెలిపారు. కాగా, ఇదే పత్తి ధర నిన్న రూ.7180 లు గరిష్ఠంగా పలికింది. కాగా, నిన్నటికి ఇవాళ్టికి పత్తి ధరలో రూ.30 వ్యత్యాసం కనపడింది.
Similar News
News November 30, 2025
రేపటి ప్రజావాణి రద్దు: కలెక్టర్

సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రేపు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వరంగల్ కలెక్టర్ సత్య శారద తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ ఉండదని స్పష్టంచేశారు. జిల్లాలోని ప్రజలు ఈ నిర్ణయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు.
News November 30, 2025
పర్వతగిరి: నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ పరిశీలన..!

స్థానిక సంస్థల ఎన్నికలకు చేపట్టిన నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు, రాష్ట్ర బీసీ కమిషనర్ బాలమాయ దేవి పరిశీలించారు. ఈ సందర్భంగా అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియ, నియమ నిబంధనలను పారదర్శకంగా చేపట్టాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. ప్రతి దశను నిష్పక్షపాతంగా చేపట్టాలన్నారు. ఇండస్ట్రియల్ జీఎం నరసింహమూర్తి ఎంపీడీవో శంకర్ పాల్గొన్నారు.
News November 30, 2025
వరంగల్: వైన్స్ బంద్.. ఇబ్బందుల్లో మందుబాబులు..!

మద్యం దుకాణాలకు నేటితో గడువు ముగుస్తున్నందున గత మూడు రోజులుగా దుకాణాలకు ప్రభుత్వం మద్యం సరఫరాను నిలిపివేసింది. కాగా, రేపటి నుంచి కొత్త షాపులు ప్రారంభం కానుండగా, అధికశాతం షాపులు పాత అడ్డాల్లోనే ఏర్పాటు చేస్తున్నారు. స్టాక్ లేకపోవడం, నూతన షాపుల కోసం నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకుంటుండటంతో జిల్లాలో వైన్ షాపులు బంద్ చేశారు. దీంతో మద్యం దొరకక మందుబాబులు విలవిల్లాడుతూ బెల్టు షాపులకు పరుగులు పెడుతున్నారు.


