News December 19, 2024

వరంగల్ మార్కెట్‌లో పత్తి క్వింటా రూ.7,020 

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో కొద్దిరోజులుగా పత్తి ధర రూ.7 వేలకు పైగా పలుకుతోంది. సోమవారం రూ.7,010 పలికిన క్వింటా పత్తి ధర.. మంగళవారం రూ.7,000, బుధవారం రూ.7,030 పలికాయి. అలాగే నేడు రూ.7,020 పలికినట్లు వ్యాపారులు తెలిపారు. మార్కెట్‌కి ఈరోజు పత్తి తరలి రాగా క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి.

Similar News

News January 16, 2025

వరంగల్ మార్కెట్లో చిరుధాన్యాల ధరలు ఇలా!

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఈరోజు వివిధ రకాల చిరుధాన్యాలు తరలివచ్చాయి. పచ్చి పల్లికాయ క్వింటా ధర రూ.4300 పలకగా.. సూక పల్లికాయ ధర రూ.6210 పలికింది. అలాగే కందులు క్వింటాకు రూ.7003, బబ్బెర్లు రూ.7100, నల్లనువ్వులు రూ.11,500 పలికినట్లు రైతన్నలు తెలిపారు. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.

News January 16, 2025

వరంగల్: జాతరల సీజన్.. మీరు ఎక్కడికి వెళుతున్నారు!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాతరలు, ఉర్సు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే కొత్తకొండ, ఐనవోలు, ఊరుగొండ ఆలయాలకు భక్తులు తరలి వెళ్తున్నారు. అన్నారం దర్గా ఉర్సు ఉత్సవాలు ఈ నెల 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు జరగనన్నాయి. అంతేకాకుండా వచ్చే నెల 12 నుంచి మేడారం మినీ జాతర జరగనుంది. ఈ సందర్భంగా అధికారులు అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. మరి మీరు ఎక్కడికి వెళుతున్నారో కామెంట్ చేయండి.

News January 16, 2025

నేటి నుంచి అన్నారం ఉర్సు ఉత్సవాలు

image

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని అన్నారం హజ్రత్ సయ్యద్ యాకుబ్ షావలి దర్గా ఉత్సవాలు గురువారం నుంచి ఘనంగా జరగనున్నాయి. ఈనెల 16న గంధం, 17న దీపారాధన, 18న ఖత్ మే ఖురాన్ ఉత్సవాలు జరగనున్నాయి. మత సామరస్యానికి ప్రతీకగా అన్నారం దర్గా నిలుస్తోంది. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉత్సవాలకు విచ్చేస్తుంటారు. మీరూ ఉర్సు ఉత్సవాలకు వెళ్తే కామెంట్ చేయండి.