News February 21, 2025

వరంగల్ మార్కెట్‌లో పత్తి ధర రూ. 6,800

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నేడు పత్తి ధర మళ్లీ తగ్గింది. సోమవారం, మంగళవారం రూ.6,800 పలికిన క్వింటా పత్తి ధర.. బుధవారం, గురువారం రూ.6,810 పలికింది. ఈరోజు మళ్లీ రూ.10 తగ్గి, రూ.6,800కి పడిపోయినట్లు వ్యాపారులు తెలిపారు. మార్కెట్‌కు నేడు పత్తి తరలి రాగా.. ధర తగ్గడంతో అన్నదాతలు నిరాశ చెందుతున్నారు.

Similar News

News November 18, 2025

సూర్యాపేట: డ్రోన్‌ చక్కర్లు.. పోలీసులకు ఫిర్యాదు

image

మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామ శివారులో 4 రోజులుగా డ్రోన్ కెమెరా చక్కర్లు కొడుతుండటంతో రైతులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో డ్రోన్ గ్రామం, పంట పొలాల మీదుగా తిరుగుతోంది. మహీంద్రా ఎస్‌యూవీలో వచ్చిన నలుగురు వ్యక్తులు ఈ డ్రోన్‌ను ఎగురవేశారు. వారిని ప్రశ్నించినా సరైన సమాధానం ఇవ్వకపోవడంతో, స్థానికులు వారిని పోలీసులకు అప్పగించి, ఫిర్యాదు చేశారు.

News November 18, 2025

సూర్యాపేట: డ్రోన్‌ చక్కర్లు.. పోలీసులకు ఫిర్యాదు

image

మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామ శివారులో 4 రోజులుగా డ్రోన్ కెమెరా చక్కర్లు కొడుతుండటంతో రైతులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో డ్రోన్ గ్రామం, పంట పొలాల మీదుగా తిరుగుతోంది. మహీంద్రా ఎస్‌యూవీలో వచ్చిన నలుగురు వ్యక్తులు ఈ డ్రోన్‌ను ఎగురవేశారు. వారిని ప్రశ్నించినా సరైన సమాధానం ఇవ్వకపోవడంతో, స్థానికులు వారిని పోలీసులకు అప్పగించి, ఫిర్యాదు చేశారు.

News November 18, 2025

వరంగల్: సాదాబైనామాల సంగతేందీ..?

image

సాదాబైనామాలతో కొనుగోలు చేసిన భూములపై హక్కుల కోసం రైతులకు ఏళ్లుగా ఎదురుచూపులే మిగిలాయి. భూ భారతిలో వీలు కల్పించారని నేతలు చెబుతుంటే, అధికారులు మాత్రం కాసులు వచ్చే వాటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వివాదాస్పదమైన వాటిని మాత్రం ముట్టుకోకుండానే రిజెక్టు చేస్తున్నారు. WGLలో 53996, HNK 18507, MLG 34441, JNG 30వేలు, MBD 24014, BHPL 18739 దరఖాస్తులు వచ్చాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,79,697 దరఖాస్తులు వచ్చాయి.