News February 21, 2025

వరంగల్ మార్కెట్‌లో పత్తి ధర రూ. 6,800

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నేడు పత్తి ధర మళ్లీ తగ్గింది. సోమవారం, మంగళవారం రూ.6,800 పలికిన క్వింటా పత్తి ధర.. బుధవారం, గురువారం రూ.6,810 పలికింది. ఈరోజు మళ్లీ రూ.10 తగ్గి, రూ.6,800కి పడిపోయినట్లు వ్యాపారులు తెలిపారు. మార్కెట్‌కు నేడు పత్తి తరలి రాగా.. ధర తగ్గడంతో అన్నదాతలు నిరాశ చెందుతున్నారు.

Similar News

News November 6, 2025

మినుము పంటలో విత్తన శుద్ధితో అధిక దిగుబడి

image

మినుము పంటలో తెగుళ్ల కట్టడికి విత్తనశుద్ధి కీలకం. దీని కోసం కిలో విత్తనానికి 2.5 గ్రాముల కాప్టాన్ (లేదా) థైరాన్ (లేదా) మాంకోజెబ్‌లతో విత్తనశుద్ధి చేయాలి. తర్వాత కిలో విత్తనానికి 5ml ఇమిడాక్లోప్రిడ్ 600 FS మందును కలిపి నీడలో ఆరనివ్వాలి. విత్తడానికి గంట ముందుగా కిలో విత్తనానికి 20గ్రా రైజోబియం కల్చరును కలిపినట్లైతే, నత్రజని బాగా అందుబాటులో ఉండటం వల్ల, అధిక పంట దిగుబడిని పొందవచ్చు.

News November 6, 2025

పెద్దపల్లిలో రోడ్ సేఫ్టీ పనుల స్థల పరిశీలన

image

PDPLబస్టాండ్, అయ్యప్ప టెంపుల్ వద్ద రోడ్ సేఫ్టీ పనులను గురువారం మున్సిపల్, RTC, ట్రాఫిక్ అధికారులతో కలిసి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ పరిశీలించారు. ఇటీవల కలెక్టర్ కోయ శ్రీహర్ష అధ్యక్షతన జరిగిన రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశంలో ఇచ్చిన సూచనల మేరకు బస్సులు, వాహనదారులు సురక్షితంగా ప్రయాణించేందుకు రోడ్ వెడల్పు, ఫ్రీ లెఫ్ట్ ఏర్పాట్లకు ప్రణాళికలు సిద్ధం చేశారు. RTC అధికారులతో చర్చించి పనులు ప్రారంభిస్తామన్నారు.

News November 6, 2025

గోదావరిఖని: ‘అబ్సెంటిజం సర్క్యూలర్‌పై ఆందోళనలో కార్మిక వర్గం’

image

సింగరేణి యాజమాన్యం అబ్సెంటిజంపై జారీ చేసిన సర్క్యూలర్‌తో కార్మిక వర్గం ఆందోళనకు గురవుతుందని TBGKS అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అబ్సెంటిజం సర్క్యూలర్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని, మెడికల్‌ బోర్డు నిర్వహణ త్వరలో చేపట్టాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి పోరాటం చేయడం తప్పదని హెచ్చరించారు.