News February 12, 2025

వరంగల్ మార్కెట్లో భారీగా పతనమైన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నేడు పత్తి ధర భారీగా పతనమైంది. నిన్న మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,060 పలకగా.. నేడు రూ.6,950కి పడిపోయినట్లు వ్యాపారులు తెలిపారు. ఒకరోజు వ్యవధిలోనే రూ.110 ధర తగ్గడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగేలా అధికారులు, వ్యాపారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Similar News

News November 20, 2025

చేవెళ్ల: ఎర్ర నీళ్లతో వీధి కుక్కలకు చెక్ పెట్టే ఆలోచన

image

వీధి కుక్కల బెడద నుంచి తప్పించుకునేందుకు చేవెళ్ల పట్టణంలోని అంబేడ్కర్ నగర్ కాలనీ వాసులు వినూత్న ఆలోచన చేశారు. ఎర్ర నీళ్లను ఖాళీ వాటర్ బాటిళ్లలో నింపి ఇంటి ముందు ఏర్పాటు చేశారు. ఎర్ర నీళ్లను చూసి వీధి కుక్కలు ఇంటి దగ్గరకు రాకుండా రోడ్డుపై ఉంటున్నాయని కాలనీవాసులు తెలిపారు. వీధి కుక్కల బెడద కోసం ఎర్రనీళ్ల ఆలోచన బాగుందని పలువురు చర్చించుకుంటున్నారు.

News November 20, 2025

చేవెళ్ల: ఎర్ర నీళ్లతో వీధి కుక్కలకు చెక్ పెట్టే ఆలోచన

image

వీధి కుక్కల బెడద నుంచి తప్పించుకునేందుకు చేవెళ్ల పట్టణంలోని అంబేడ్కర్ నగర్ కాలనీ వాసులు వినూత్న ఆలోచన చేశారు. ఎర్ర నీళ్లను ఖాళీ వాటర్ బాటిళ్లలో నింపి ఇంటి ముందు ఏర్పాటు చేశారు. ఎర్ర నీళ్లను చూసి వీధి కుక్కలు ఇంటి దగ్గరకు రాకుండా రోడ్డుపై ఉంటున్నాయని కాలనీవాసులు తెలిపారు. వీధి కుక్కల బెడద కోసం ఎర్రనీళ్ల ఆలోచన బాగుందని పలువురు చర్చించుకుంటున్నారు.

News November 20, 2025

GWL: ఆ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలి- కురువ పల్లయ్య

image

స్టూడెంట్‌ను మోకాళ్లపై నడిపించి గాయాలు అయ్యేందుకు కారణమైన వడ్డేపల్లి మండలంలోని శారద విద్యానికేతన్ గుర్తింపును రద్దు చేయాలని BRSV గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య పేర్కొన్నారు. గురువారం గద్వాలలో మీడియాతో మాట్లాడారు. తల్లిదండ్రులు ఎంతో ఆశతో వేలకు వేలు ఫీజు చెల్లించి, విద్యాబుద్ధులు నేర్పమని పంపితే అనాగరికంగా విద్యార్థులను ఇబ్బందికి గురి చేయడమేంటంటూ ప్రశ్నించారు.