News February 25, 2025

వరంగల్ మార్కెట్‌లో మిర్చి ధరలు ఇలా..

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం మిర్చి ఉత్పత్తులు తరలి రాగా ధరలు ఇలా ఉన్నాయి. 5,531 మిర్చి ధర రూ.11,100 పలకగా, దీపిక మిర్చి రూ.17,500 ధర పలికాయి. అలాగే ఎల్లో మిర్చికి రూ.19 వేలు, టమాటా మిర్చికి రూ.31,0111, సింగిల్ పట్టి రూ.31 వేల ధర వచ్చినట్లు వ్యాపారులు చెప్పారు. గమనిక: రేపటి నుంచి మార్కెట్‌కు వరుసగా ఐదు రోజుల సెలవులు.

Similar News

News February 26, 2025

వరంగల్: ఇంట్లో పేలుడు.. ఉలిక్కిపడ్డ ప్రజలు 

image

వరంగల్ కొత్తవాడలో తాళం వేసిన ఇంట్లో పేలుడు సంభవించింది. ఒక్కసారిగా పేలడంతో అక్కడే నివసిస్తున్న ప్రజలందరూ ఉలిక్కి పడ్డారు. తాళం వేసిన ఇంట్లో అనుమానాస్పద పదార్థాలు పేలినట్లు చర్చించుకుంటున్నారు. ఆందోళనకు గురైన కాలనీవాసులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక మట్టేవాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

News February 26, 2025

MNCL: రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నగదు జమ

image

మంచిర్యాల జిల్లాలోని రైతుల ఖాతాల్లో 19వ విడత పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూ.2 వేలు నగదు జమ చేసింది. జిల్లాలోని అర్హులైన రైతులకు ప్రతి ఏడాది మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున రూ.6 వేలు జమ చేస్తోంది. ఇప్పటి వరకు 17వ విడతలో 55,658 మంది రైతులకు, 18వ విడతలో 40,534 మంది ఖాతాల్లో నగదు జమ కాగా.. ఈ విడతలో 56 వేల మంది వరకు రైతుల ఖాతాల్లో జమ కానుంది.

News February 26, 2025

నేడు ఓర్వకల్లుకు ప్రముఖ లేడీ సింగర్ రాక

image

ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గలోని శ్రీ భ్రమరాంబ సమేత బుగ్గ రామేశ్వర స్వామి ఆలయంలో బుధవారం శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత ఆధ్వర్యంలో నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రముఖ సింగర్ మధుప్రియ, పల్సర్ బైక్ ఝాన్సీ, రమేశ్ బృందం సందడి చేయనుంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

error: Content is protected !!