News February 25, 2025
వరంగల్ మార్కెట్లో మిర్చి ధరలు ఇలా..

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం మిర్చి ఉత్పత్తులు తరలి రాగా ధరలు ఇలా ఉన్నాయి. 5,531 మిర్చి ధర రూ.11,100 పలకగా, దీపిక మిర్చి రూ.17,500 ధర పలికాయి. అలాగే ఎల్లో మిర్చికి రూ.19 వేలు, టమాటా మిర్చికి రూ.31,0111, సింగిల్ పట్టి రూ.31 వేల ధర వచ్చినట్లు వ్యాపారులు చెప్పారు. గమనిక: రేపటి నుంచి మార్కెట్కు వరుసగా ఐదు రోజుల సెలవులు.
Similar News
News December 3, 2025
మీ బ్రెయిన్ ఏ గేర్ వేసింది..?

మన మెదడు 9, 32, 66, 83 వయస్సుల్లో లెవల్ షిఫ్ట్ అవుతుందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. 0-9yrs: పరిసరాలు తెలుసుకోవడం. 9-32: పరిపక్వత దిశగా ప్రయాణం, భావోద్వేగాలు, పనితీరు, ఆలోచన శక్తి పెరుగుతాయి. గ్రాఫ్ వేస్తే.. 32Yrs పీక్ పర్ఫార్మెన్స్. 32-66: సెటిల్డ్, లిమిటేషన్స్ మెంటాల్టి. ప్రిడిక్టబుల్ థాట్స్. 66-83: మతిమరుపు, అనారోగ్యం, రిజర్వ్డ్ అవుతారు. 83- కొన్ని పనులు, ఆలోచనలే చేయగలరు.
News December 3, 2025
సంగారెడ్డి: 191 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు

పంచాయతీ ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి హాజరుకాని 191 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య బుధవారం తెలిపారు. డిసెంబర్ 5న నిర్వహించే డివిజన్ స్థాయి శిక్షణ కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాల్గొనాలని ఆమె సూచించారు. లేకుంటే, ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
News December 3, 2025
పార్వతీపురం: సీఎం గారూ.. ఆశలన్నీ మీపైనే!

భామిని మండలంలో ఈ నెల 5న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో నెలకొన్న సమస్యల పరిష్కార చర్యలపై కదలిక వస్తుందా? అని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా జిల్లాలో వేధిస్తున్న ఏనుగుల సమస్య, వసతి గృహాల్లో విద్యార్థుల మరణాలు, విద్యా, వైద్య సిబ్బంది నియామకాలు, గిరిజనుల అభ్యున్నతిపై సీఎం హామీలు, నిధుల కేటాయింపుపై ప్రకటన చేస్తారేమోనని ప్రజలు వేచి చూస్తున్నారు.


