News February 25, 2025

వరంగల్ మార్కెట్‌లో మిర్చి ధరలు ఇలా..

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం మిర్చి ఉత్పత్తులు తరలి రాగా ధరలు ఇలా ఉన్నాయి. 5,531 మిర్చి ధర రూ.11,100 పలకగా, దీపిక మిర్చి రూ.17,500 ధర పలికాయి. అలాగే ఎల్లో మిర్చికి రూ.19 వేలు, టమాటా మిర్చికి రూ.31,0111, సింగిల్ పట్టి రూ.31 వేల ధర వచ్చినట్లు వ్యాపారులు చెప్పారు. గమనిక: రేపటి నుంచి మార్కెట్‌కు వరుసగా ఐదు రోజుల సెలవులు.

Similar News

News November 23, 2025

ఏపీ టెట్.. కొన్ని గంటలే గడువు

image

AP TET దరఖాస్తులకు కొన్ని గంటలు మాత్రమే గడువు ఉంది. ఇవాళ 11.59PMలోపు అప్లై చేసుకోవాలి. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ అర్హత తప్పనిసరి అని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే దాదాపు 2L మంది దరఖాస్తు చేసుకున్నారు. డిసెంబర్ 3న హాల్‌టికెట్లు విడుదలవుతాయి. DEC 10 నుంచి రోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. JAN 19న ఫలితాలు వెల్లడిస్తారు.
వెబ్‌సైట్: https://cse.ap.gov.in/

News November 23, 2025

యువకులు గల్లంతుపై ఇన్‌ఛార్జి మంత్రి ఆరా

image

కొమరాడ మండలం జంఝావతి రబ్బరు డ్యాంలో ముగ్గురు యువకులు గల్లంతుపై జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. సివిని గ్రామానికి చెందిన యువకులని మంత్రికి వివరించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించినట్లు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించినట్లు తెలిపారు.

News November 23, 2025

వేగంగా కోలుకుంటున్న శ్రేయస్

image

ఆసీస్‌తో ODI సిరీస్‌లో గాయపడిన శ్రేయస్ అయ్యర్ వేగంగా కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యంపై PBKS కో ఓనర్ ప్రీతిజింటా అప్డేట్ ఇచ్చారు. ఆ జట్టు ప్లేయర్ శశాంక్ సింగ్ బర్త్‌డే పార్టీలో దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. శ్రేయస్ అద్భుతంగా రికవరీ అవుతూ బయటకు రావడం సంతోషంగా ఉందన్నారు. కాగా SAతో ODI సిరీస్‌కు అతను ఇప్పటికే దూరమయ్యారు. జనవరిలో NZతో జరిగే వన్డేలకు అందుబాటులోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.