News September 25, 2024

వరంగల్ మార్కెట్లో సరుకుల ధరలు ఇలా!

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం సూక పల్లికాయ ధర రూ.5,840 పలికింది. అలాగే పచ్చి పల్లికాయ రూ.3800 పలికింది. మరోవైపు 5531 రకం మిర్చికి రూ.14 వేలు, పసుపునకు రూ.13,119 వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. కాగా, నిన్నటితో పోలిస్తే ఈరోజు అన్ని రకాల సరుకుల ధరలు తగ్గాయి.

Similar News

News December 3, 2025

నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగిన చూడాలి: కలెక్టర్

image

గ్రామపంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని వరంగల్ కలెక్టర్ సత్య శారద అన్నారు. అమిన్‌పేట క్లస్టర్ గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. నామినేషన్ స్వీకరణ కేంద్రంలో జరుగుతున్న ఏర్పాట్లు, సిబ్బంది పనితీరు, అభ్యర్థుల రద్దీ, సమర్పణ ప్రక్రియను ఆమె సమగ్రంగా పరిశీలించారు. అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు.

News December 3, 2025

వంజరపల్లిలో సర్పంచ్ ఎన్నికపై ఉత్కంఠ!

image

సంగెం మండలం వంజరపల్లిలో ఎస్టీ జనాభా లేకపోవడంతో సర్పంచ్, 1,4,6 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఎస్టీ జనాభా లేని గ్రామానికి ఈ పదవులు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించగా, పిటిషన్ ద్విసభ్య ధర్మాసనానికి వెళ్లింది. నామినేషన్ గడువు ముగిసే సమయానికి 5 వార్డులకు మాత్రమే నామినేషన్లు రావడంతో, ఉప సర్పంచ్‌గానే గ్రామ పాలన నడిచే పరిస్థితి.

News December 1, 2025

గ్రామపంచాయతీ ఎన్నికలపై కలెక్టర్ సత్య శారద సమీక్ష

image

వరంగల్ జిల్లాలో గ్రామపంచాయతీ, వార్డ్ మెంబర్ రెండో సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద నియమించిన నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తిస్థాయిలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సాగేందుకు నోడల్ అధికారులు మరింత శ్రద్ధ వహించాలని ఆదేశాలు జారీ చేశారు.