News April 3, 2025
వరంగల్: ముగిసిన పదిపరీక్షలు.. పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి!

న్నటితో పదోతరగతి పరీక్షలు ముగిశాయి. దీంతో విద్యార్థులు ఫ్రీ బర్డ్స్ లాగా తిరగాలని భావిస్తారు. కాబట్టి తల్లిదండ్రులు వారి కదలికలపై ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు బైకులు ఇవ్వొద్దని, స్నేహితులతో చెరువులకు వెళ్లకుండా చూడాలన్నారు. వారు ఈత నేర్చుకుంటానంటే పేరెంట్సే పర్యవేక్షించాలని, మత్తుపదార్థాలకు అలవాటు పడుతున్నారో లేదా గమనిస్తూ ఉండాలంటున్నారు.
Similar News
News April 17, 2025
వాట్సాప్ గవర్నెన్స్ కరపత్రాన్ని ఆవిష్కరించిన ఎంపీ

రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా అన్ని రకాల ప్రభుత్వ సేవలు సులభంగా పొందవచ్చని విశాఖ ఎంపీ శ్రీభరత్, కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం విశాఖ కలెక్టరేట్లో వాట్సాప్ గవర్నెన్స్ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ నెంబరుకు హాయ్ అని మెసేజ్ పెట్టి ప్రజలకు కావాల్సిన సేవను ఎంపిక చేసుకోవచ్చన్నారు.
News April 17, 2025
తెలుగులోకి మలయాళ సూపర్ హిట్ చిత్రం!

మలయాళంలో విడుదలై సూపర్ హిట్గా నిలిచిన ‘అలప్పుజ జింఖానా’ తెలుగులో రిలీజ్ కానుంది. ఇప్పటికే రూ.30 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ఈ నెల 25న తెలుగులో విడుదల కానున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. కాలేజ్ బ్యాక్ గ్రౌండ్లో బాక్సింగ్ క్రీడా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. గతంలో విడుదలైన ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ వంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే.
News April 17, 2025
అలంపూర్: విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన అదనపు కలెక్టర్

అలంపూర్ నియోజకవర్గ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు మెరుగ్గా ఉండేందుకు కృషి చేయాలని ఉపాధ్యాయులకు ఆయన ఆదేశించారు. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో సౌకర్యాలు ఎలా ఉన్నాయని విద్యార్థులతో అడిగి తెలుసుకున్నారు.