News July 22, 2024
వరంగల్: యువకుడి మృతి

మానసిక స్థితి సరిగా లేని యువకుడు బావిలో పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఖిలా వరంగల్ మండలం బొల్లికుంటకు చెందిన ఎర్ర వంశీ (24) HYDలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల ఇంటికి వచ్చిన అతడు ఈ నెల 19న HYD వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పి బయల్దేరాడు. ఆదివారం గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో వంశీ మృతదేహం కనిపించడంతో రైతులు కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 17, 2025
వరంగల్: ‘గురుకుల పాఠశాల కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించాలి’

వరంగల్ జిల్లాలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలలకు భోజన సరఫరా చేసే క్యాటరింగ్ కాంట్రాక్టర్లు, తమ పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని, పెరిగిన మార్కెట్ ధరలను దృష్టిలో పెట్టుకొని రేట్లను సవరించాలని కోరుతూ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారానికి వినతిపత్రం అందజేశారు. గత నాలుగు నెలలుగా బిల్లులు విడుదల కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణరావు తెలిపారు.
News November 17, 2025
వరంగల్: ‘గురుకుల పాఠశాల కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించాలి’

వరంగల్ జిల్లాలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలలకు భోజన సరఫరా చేసే క్యాటరింగ్ కాంట్రాక్టర్లు, తమ పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని, పెరిగిన మార్కెట్ ధరలను దృష్టిలో పెట్టుకొని రేట్లను సవరించాలని కోరుతూ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారానికి వినతిపత్రం అందజేశారు. గత నాలుగు నెలలుగా బిల్లులు విడుదల కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణరావు తెలిపారు.
News November 17, 2025
వరంగల్: ప్రజావాణిలో 124 వినతుల స్వీకరణ

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు సోమవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ జి.సంధ్య రాణి హాజరై ప్రజలు ఇచ్చిన వినతులను స్వయంగా స్వీకరించారు. ఈరోజు నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 124 దరఖాస్తులు స్వీకరించారు. వీటిలో అధిక శాతం రెవెన్యూ, జీడబ్ల్యూఎంసీ సమస్యలకు సంబంధించినవని అధికారులు పేర్కొన్నారు.


