News February 14, 2025
వరంగల్: రైతన్నకు తీవ్ర నిరాశ.. భారీగా పడిపోయిన పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈవారం మొదటి నుంచి పత్తి ధరలు భారీగా పడిపోతున్నాయి. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,060 పలకగా.. బుధవారం రూ.6,950, గురువారం రూ.6,900కి పడిపోయింది. నేడు ఇంకా పతనమై రూ.6820కి చేరినట్లు వ్యాపారులు తెలిపారు. మూడు రోజుల వ్యవధిలోనే రూ.240 ధర తగ్గడంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.
Similar News
News November 27, 2025
VKB: ‘మెరుగైన వైద్య సేవలు అందించాలి’

గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి సూచించారు. గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లోని వైద్యాధికారి కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ స్వర్ణకుమారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న క్షేత్రస్థాయి పర్యవేక్షక సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు.
News November 27, 2025
MHBD: ఎన్నికల ప్రవర్తన నియమావళిని కఠినంగా అమలు చేస్తాం: SP

ఎన్నికల ప్రవర్తన నియమావళిని కఠినంగా అమలు చేస్తామని ఎస్పీ డా.శబరిష్ తెలిపారు.MHBD జిల్లా పరిధిలో జరగనున్న మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ దశను పూర్తిగా శాంతియుతంగా,నిష్పాక్షికంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అమలు చేస్తూ నామినేషన్ల సమయంలో ఎలాంటి అశాంతి,అవకతవకలు జరగకుండా పోలీస్ అధికారులు,సిబ్బంది హైఅలర్ట్ ఉన్నారన్నారు.
News November 27, 2025
ఇతిహాసాలు క్విజ్ – 79 సమాధానాలు

ఈరోజు ప్రశ్న: శ్రీకాళహస్తి క్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చింది?
సమాధానం: శివ భక్తులైన మూడు జీవులు శివుడి కోసం తమ ప్రాణాలను అర్పించి మోక్షం పొందాయి. అవే.. శ్రీ (సాలెపురుగు), కాళ (పాము), హస్తి (ఏనుగు). ఈ 3 జీవులు శివుడిని అత్యంత భక్తితో పూజించి, స్వామి అనుగ్రహం పొంది అక్కడే లీనమయ్యాయి. వీటి పేర్ల కలయికతోనే ఈ పుణ్యక్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు స్థిరపడింది.
<<-se>>#Ithihasaluquiz<<>>


