News January 29, 2025
వరంగల్: ‘రైతు భరోసా’ భూముల సర్వే పూర్తి!

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం వరంగల్ జిల్లాలో రైతు భరోసా పథకం అమలు కోసం భూముల సర్వేను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. పథకంలో సాగు చేసే భూములను, సాగుకు సంబంధం లేని భూములను సర్వేలో అధికారులు గుర్తించారు. ఇందులో జిల్లాలో 2.67 లక్షల ఎకరాలను సాగులో ఉన్నవిగా, 2,350 ఎకరాలను సాగులో లేనివిగా నిర్ధారణకు వచ్చారు. ఈ వివరాలను ప్రభుత్వానికి నివేదించారు.
Similar News
News February 13, 2025
పోలీసులు విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకోవాలి: పీటీసీ ప్రిన్సిపల్

పోలీసులు విధి నిర్వహణలోని మంచి పేరు తెచ్చుకోవాలని మామునూర్ పీటీసీ ప్రిన్సిపల్ పూజ అన్నారు. బుధవారం మామునూర్ క్యాంప్లో కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ పొందిన 256 కానిస్టేబుళ్ల శిక్షణకు పూజ హాజరై మాట్లాడారు. శిక్షణ ద్వారా నేర్చుకున్న ప్రతి విషయం విధి నిర్వహణలో తోడ్పాటు కాగలదని, చెప్పారు. డీఎస్పీలు రమేష్, వేంకటేశ్వర రావు, రవీందర్, పాండునాయక్, పీఆర్ఓ రామాచారి పాల్గొన్నారు.
News February 12, 2025
ముగిసిన రెండో విడత ఇంటర్ ప్రయోగ పరీక్షలు

వరంగల్ జిల్లా వ్యాప్తంగా రెండో విడత ఇంటర్ ప్రయోగ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు డీఐఈఓ డా.శ్రీధర్ సుమన్ తెలిపారు. ఫిబ్రవరి 8 నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ప్రయోగ పరీక్షలు ఐదు రోజులు నిరాటంకంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రతీ రోజు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండు వేళల్లో పరీక్షలు నిర్వహించారు.
News February 12, 2025
ప్రభుత్వ దవాఖానలో ప్రసవాల రేటు పెంచాలి: DMHO

ప్రభుత్వ దవాఖానలో ప్రసవాల రేటు పెంచాలని జిల్లా DMHO గోపాల్ రావు అన్నారు. గీసుగొండ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని DMHO తనిఖీ చేసి మాట్లాడారు.ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలకు విశ్వాసాన్ని కల్పించాలన్నారు. పల్లె దవాఖానలో పని చేసే డాక్టర్లు, సిబ్బంది సమయ పాలన పాటించాలన్నారు. సమయపాలన పాటించని సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.