News February 16, 2025

వరంగల్: రైలు కింద పడి మహిళ ఆత్మహత్య

image

రైలు కింద పడి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లా గీసుకొండలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ధర్మారంలో ఓ ప్రైవేట్ షాపులో పని చేసే గోపాల రమ్య(35) 3రోజుల నుంచి కడుపునొప్పితో బాధపడుతోంది. ఆ బాధను తట్టుకోలేక చింతలపల్లి రైల్వే స్టేషన్ మధ్య ధర్మారం సమీపంలో గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించామని జీఆర్పీ పోలీసులు తెలిపారు.

Similar News

News March 22, 2025

KMR: స్కానింగ్ కేంద్రాలపై నిఘా పెంచాలి: కలెక్టర్

image

స్కానింగ్ కేంద్రాలపై నిఘా పెంచాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్ష చట్టం అమలు కోసం జిల్లా మల్టీ మెంబర్ అథారిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. స్కానింగ్ కేంద్రాల్లో రికార్డులు, రిజిష్టర్‌ల నిర్వహణ పకడ్బందీగా ఉండేట్లు చూడాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా జడ్జి వర ప్రసాద్ ఉన్నారు.

News March 22, 2025

HYD: ప్రియుడి సూచన.. NTR స్టేడియంలో దారుణం

image

NTR స్టేడియంలో పసిపాపను కాల్చివేసిన ఘటనలో మైనర్ బాలుడిని దోమలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. కవాడిగూడకు చెందిన మైనర్ బాలిక, నల్గొండ జిల్లాకు చెందిన బాలుడు ప్రేమించుకుంటున్నారు. శారీరకంగానూ ఒక్కటి అవ్వడంతో బాలిక గర్భం దాల్చింది. నెలలు నిండక ముందే డెలివరీ కావటంతో పుట్టుకతోనే పాప చనిపోయింది. ప్రియుడి సూచన మేరకు NTR స్టేడియంలో మృతశిశువును బాలిక కాల్చివేసింది. పోలీసులు బాలుడిని జువైనల్‌కి తరలించారు.

News March 22, 2025

కూల్‌డ్రింక్స్ తాగుతున్నారా?

image

శీతల పానీయాల్లో మైక్రోప్టాస్టిక్‌లు ఉన్నట్లు థాయిలాండ్‌లో నిర్వహించిన పరిశోధనలో తేలింది. ప్యాకేజీతో సంబంధం లేకుండా మొత్తం 9 బ్రాండ్లలో మైక్రోప్లాస్టిక్‌ గుర్తించారు. ఏడాదికి ఓ వ్యక్తి సగటున 41.13 లీటర్ల కూల్‌డ్రింక్స్ తాగుతున్నట్లు గుర్తించారు. కూల్‌డ్రింక్స్ జీవక్రియ, హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. మైక్రోప్లాస్టిక్ శరీరంపై చూపే ప్రతికూల ప్రభావాల గురించి మరింత పరిశోధనలు చేయనున్నారు.

error: Content is protected !!