News February 16, 2025

వరంగల్: రైలు కింద పడి మహిళ ఆత్మహత్య

image

రైలు కింద పడి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లా గీసుకొండలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ధర్మారంలో ఓ ప్రైవేట్ షాపులో పని చేసే గోపాల రమ్య(35) 3రోజుల నుంచి కడుపునొప్పితో బాధపడుతోంది. ఆ బాధను తట్టుకోలేక చింతలపల్లి రైల్వే స్టేషన్ మధ్య ధర్మారం సమీపంలో గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించామని జీఆర్పీ పోలీసులు తెలిపారు.

Similar News

News November 12, 2025

ఢిల్లీ పేలుడు: తబ్లీగీ జమాత్ మసీదులో 15 నిమిషాలు గడిపి..

image

ఢిల్లీ పేలుడు ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఉమర్ నబీకి సంబంధించి కీలక విషయాలు బయటపడుతున్నాయి. బ్లాస్ట్‌కు ముందు ఓల్డ్ ఢిల్లీలోని తబ్లీగీ జమాత్ మసీదుకు అతడు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ 10-15 నిమిషాలు గడిపాడని, తర్వాత ఎర్రకోటలోని పార్కింగ్ ప్లేస్‌కు వెళ్లాడని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. అతడు మసీదులోకి వచ్చి వెళ్లిన ఫుటేజీ సీసీటీవీలో రికార్డయిందని చెప్పాయి.

News November 12, 2025

HYD: ఫుడ్ స్టార్టప్‌లకు పోత్సాహకం: జయేష్ రంజన్

image

రాష్ట్రంలో సంప్రదాయ ఆహారానికి ప్రపంచ వేదికపై అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం దేశంలోనే తొలిసారి HYD వేదికగా ‘తెలంగాణ కలినరీ ఎక్స్‌‌‌‌పీరియన్షియల్ టూరిజం యాక్సిలరేటర్ (TSETA) ప్రారంభించింది. ఇండో- డచ్ సహకారంతో తెలంగాణ రుచులను ఇందులో ప్రదర్శించారు. ఫుడ్​ స్టార్టప్​లకు ప్రోత్సాహకంగా ఫుడ్-టెక్, డ్రింక్స్ రంగాల్లో స్టార్టప్‌‌‌‌లను ప్రోత్సహించనున్నట్లు స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ తెలిపారు.

News November 12, 2025

ఖమ్మం: మొంథా తుఫాన్.. ఎకరానికి రూ.10 వేలు పరిహారం

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొంథా తుఫాన్ వల్ల జరిగిన పంట నష్టాన్ని వ్యవసాయ శాఖ నివేదించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని పంపాలని తాను కోరినట్లు మంత్రి వెల్లడించారు. త్వరలోనే పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు చొప్పున పరిహారం చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు.