News February 16, 2025

వరంగల్: రైలు కింద పడి మహిళ ఆత్మహత్య

image

రైలు కింద పడి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లా గీసుకొండలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ధర్మారంలో ఓ ప్రైవేట్ షాపులో పని చేసే గోపాల రమ్య(35) 3రోజుల నుంచి కడుపునొప్పితో బాధపడుతోంది. ఆ బాధను తట్టుకోలేక చింతలపల్లి రైల్వే స్టేషన్ మధ్య ధర్మారం సమీపంలో గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించామని జీఆర్పీ పోలీసులు తెలిపారు.

Similar News

News October 20, 2025

నేడు పత్తికొండ టామాటా మార్కెట్ బంద్

image

కర్నూలు జిల్లా పత్తికొండలోని టమాటా మార్కెట్‌కు నేడు సెలవు ప్రకటించారు. దీపావళి పండుగను పురస్కరించుకుని క్రయ విక్రయాలను నిలిపివేస్తున్నట్లు యార్డు కార్యదర్శి కార్నోలీస్ తెలిపారు. రేపటి నుంచి టమాటా కొనుగోళ్లు యాథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News October 20, 2025

వీరికి వారం ముందు నుంచే ‘దీపావళి’

image

మనం దీపావళి ఏ రోజైతే ఆరోజే వేడుకలు చేసుకుంటాం. కానీ ఛత్తీస్‌గఢ్​లోని సెమ్రా గ్రామంలో దీపావళి వేడుకలు వారం ముందు నుంచే మొదలవుతాయి. ఈ ఆచారం వెనుక ఓ కారణం ఉంది. పూర్వం సింహం దాడిలో మరణించిన సర్దార్ దేవ్, గ్రామ పూజారి కలలోకి వచ్చి దీపావళి పండుగను ముందే జరపాలని చెప్పాడట. అలా చేయకపోతే దురదృష్టం కలుగుతుందని హెచ్చరించాడట. అప్పటి నుంచి అక్కడ ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. ఆ ఊర్లో OCT 20నే దీపావళి మొదలైంది.

News October 20, 2025

APPLY NOW: SECIలో 32 పోస్టులు

image

సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SECI) 32 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి ఈనెల 24, సీనియర్ కన్సల్టెంట్(10) పోస్టులకు ఈనెల 29 ఆఖరు తేదీ. పోస్టును బట్టి బీటెక్/బీఈ, పీజీ, ఎంటెక్, డిప్లొమా, ITI, CA, MBA(Fin) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థులను రాత పరీక్ష, ట్రేడ్, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.seci.co.in/