News May 12, 2024
వరంగల్: రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థిని మృతి

రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థిని మృతిచెందింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. వరంగల్లోని కరీమాబాద్కు చెందిన తన్మయి తన చెల్లి TS F SET పరీక్ష కోసం శనివారం ఘట్ కేసర్కు బయలుదేరారు. ఈక్రమంలో కారు ఆలేరు వద్ద ఎదురుగా వచ్చిన ట్రాలీని ఢీకొట్టింది. ప్రమాదంలో తన్మయికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వరంగల్ MGMకి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. తన్మయి వరంగల్ వాగ్దేవి కాలేజీలో బీటెక్ చదువుతోంది.
Similar News
News October 2, 2025
వరంగల్: శ్రీ రాజరాజేశ్వరీ అవతారంలో అమ్మవారి దర్శనం

వరంగల్ ఎంజీఎం సమీపంలోని శ్రీ రాజరాజేశ్వరీ దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం విజయ దశమి పురస్కరించుకుని సాయంత్రం అమ్మవారు వెండి చీరెలో దర్శనమిచ్చారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
News October 2, 2025
గాంధీజీ చిత్రపటానికి వరంగల్ కలెక్టర్ నివాళి

వరంగల్ కలెక్టరేట్లో గురువారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ డాక్టర్ సత్య శారదా, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన అధికారి శ్రీనివాసరావు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
News October 2, 2025
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా: వరంగల్ కలెక్టర్

విజయదశమి పర్వదినం సందర్భంగా కలెక్టర్ డాక్టర్ సత్య శారద వరంగల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఇంటా ఆనందోత్సాహాలను నింపాలని ఆమె ఆకాంక్షించారు. దుర్గాదేవి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, సిరిసంపదలతో జీవించాలని, ఈ దసరా అందరికీ విజయాలను చేకూర్చాలని ఆమె ఆకాంక్షించారు.