News April 15, 2025

వరంగల్: వేసవి సెలవులు.. ఓ కన్నేసి ఉంచండి!

image

ఈనెల 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. అయితే సెలవుల్లో పిల్లలు చెరువులు, బావుల్లో ఈతకు వెళ్లకుండా చూడాలని తల్లిదండ్రులకు అధికారులు సూచిస్తున్నారు. వారిపై ఓ కన్నేసి ఉంచాలని చెబుతున్నారు. స్నేహితులతో దూర ప్రాంతాలకు పంపవద్దని, బైకులు ఇవ్వొద్దని, ఫోన్ వాడకుండా చూడాలని అంటున్నారు. కాగా, BHPL జిల్లాలో సెలవుల్లో ప్రమాదాల బారినపడి పిల్లలు మరణించిన సందర్భాలూ ఉన్నాయి.

Similar News

News October 24, 2025

పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్‌కు ప్రతిపాదనలు: డీఆర్‌ఓ

image

పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్‌కు ప్రతిపాదనలు సమర్పించడం జరుగుతుందని డీఆర్‌ఓ ఎన్.ఎస్.కె. ఖాజావలి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో 2002 నుంచి 2025 వరకు ఉన్న ఓటరు జాబితాలను పరిశీలించి నివేదికను ఎన్నికల సంఘానికి అందించామన్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకుని ఆ వివరాలను అందించాలని కోరారు.

News October 24, 2025

PDPL: జిల్లా పంచాయతీ అధికారి సమీక్షా సమావేశం

image

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా పంచాయతీ అధికారి అధ్యక్షతన బిల్ కలెక్టర్లు, పంచాయతీ కార్యదర్శులు, మండల పంచాయతీ అధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశం జరిగింది. పన్నుల వసూళ్లు, శుభ్రత, ప్రజా సేవలు, హౌసింగ్ పథకాలు వంటి అంశాలపై చర్చించారు. గ్రామాల్లో శుభ్రత, వందశాతం పన్నుల వసూళ్లపై దృష్టి పెట్టాలని అధికారులు సూచించారు. నిర్లక్ష్యం జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News October 24, 2025

తెలంగాణ జాగృతి సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడిగా రాజు

image

తెలంగాణ జాగృతి రాష్ట్ర నేత సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడిగా పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతానికి చెందిన నిట్టూరు రాజును తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నియమించారు. ఈ సందర్భంగా రాజుకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నియమాకానికి సహకరించిన తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలికి రాజు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.