News January 3, 2025

వరంగల్: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఉమ్మడి జిల్లా మంత్రులు

image

సీఎం రేవంత్ రెడ్డిని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క కలిశారు. సావిత్రిబాయి ఫులే జయంతిని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటిస్తూ జీవో జారీ చేసినందుకు సీఎంను మంత్రులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Similar News

News September 18, 2025

ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళికలు సిద్ధం చేయాలి: కలెక్టర్

image

వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు పటిష్ఠ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ డా.సత్య శారద ఆదేశించారు. 2025-26లో 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా 260 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. రైతులు నాణ్యత ప్రమాణాలతో ధాన్యం తెచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సన్న, దొడ్డు రకాలను వేరువేరుగా నిలువ చేయాలన్నారు.

News September 18, 2025

బతుకమ్మ వేడుకలు.. దద్దరిల్లనున్న ట్రై సిటీ!

image

బతుకమ్మ వేడుకలకు వరంగల్ ట్రై సిటీ సిద్ధమవుతోంది. గ్రేటర్ వరంగల్ పరిధిలోని వేయి స్తంభాల గుడి, భద్రకాళి, పద్మాక్షమ్మ గుట్ట, ఉర్సు రంగలీలా మైదానం, చిన్న వడ్డేపల్లి చెరువు, శివనగర్ గ్రౌండ్, మెట్టుగుట్ట, మడికొండ చెరువు, బెస్తం చెరువు, తోట మైదానం, డబ్బాల్ హనుమాన్ గుడి, బంధం చెరువు, కాశిబుగ్గ శివాలయం, కట్టమల్లన్న చెరువు వద్ద వేడుకలు ఘనంగా జరుగుతాయి. వీటిలో మీరు ఏ ప్రాంతానికి వెళ్తున్నారో కామెంట్ చేయండి.

News September 17, 2025

నర్సంపేట: నేషనల్ స్పేస్ సొసైటీలో నిహారిక ఫస్ట్..!

image

నర్సంపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న భూక్య నిహారిక నేషనల్ స్పేస్ సొసైటీ (USA) నిర్వహించిన “Road Map to Space Art Contest” డ్రాయింగ్ విభాగంలో ప్రపంచ స్థాయి మొదటి బహుమతి సాధించింది. ఈ సందర్భంగా నర్సంపేట MLA దొంతి మాధవ రెడ్డి భూక్య నిహారికను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.