News March 16, 2025
వరంగల్ సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన కరీంనగర్ సీపీ

వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన సన్ ప్రీత్ సింగ్ను కరీంనగర్ వరంగల్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. అనంతరం ఇరువురు అధికారులు శాంతి భద్రతలకు సంబంధించి పలు అంశాలపై ముచ్చటించుకున్నారు. గౌస్ ఆలం ఇటీవల కరీంనగర్ నూతన సీపీ బాధ్యతలు చేపట్టారు.
Similar News
News November 8, 2025
శంషాబాద్: కేంద్ర మంత్రికి BJP నేతల స్వాగతం

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి తరఫున ప్రచారానికి కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ శకావత్ హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కొత్తూరు బీజేపీ నాయకులు శంషాబాద్ విమానాశ్రయంలో కేంద్ర మంత్రికి స్వాగతం పలికారు. ఆయనకి ఎర్రవెల్లి నాగరాజు చారి, అరవింద్ మీర్జా తదితరులు శాలువాతో సన్మానించి స్వాగతించారు.
News November 8, 2025
పెద్ద చెర్లోపల్లిలో పర్యటించనున్న CM చంద్రబాబు

CM చంద్రబాబు నాయుడు ఈనెల 11న పెద్ద చెర్లోపల్లి మండలంలో పర్యటించనున్నారు. ఈ మేరకు MLA ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి సీఎంఓ నుంచి సమాచారం అందిందన్నారు. మండలంలోని లింగన్నపాలెంలో MSME పార్క్ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారన్నారు. CM పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు MLA లింగన్నపాలెంకు బయలుదేరి వెళ్లారు.
News November 8, 2025
పర్వతగిరి: ఉద్యోగం రావడం లేదని యువకుడి ఆత్మహత్య!

పర్వతగిరి మండలం కొంకపాక గ్రామంలో ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపం చెందిన పిల్లలమర్రి భాస్కర్ (26) అనే డిగ్రీ పూర్తి చేసిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 5వ తేదీన పురుగుమందు తాగాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.


