News March 16, 2025

వరంగల్ సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన కరీంనగర్ సీపీ

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సన్ ప్రీత్ సింగ్‌ను కరీంనగర్ వరంగల్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. అనంతరం ఇరువురు అధికారులు శాంతి భద్రతలకు సంబంధించి పలు అంశాలపై ముచ్చటించుకున్నారు. గౌస్ ఆలం ఇటీవల కరీంనగర్ నూతన సీపీ బాధ్యతలు చేపట్టారు.

Similar News

News October 23, 2025

ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వీ యాదవ్‌?

image

బిహార్ మహాఘట్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ పేరును ప్రకటించే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని ఆర్జేడీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఆ కూటమిలో సీట్ల పంపకాల వివాదం సద్దుమణిగినట్లు తెలుస్తోంది.

News October 23, 2025

కృష్ణా: వర్షంతో రోడ్లు అస్తవ్యస్తం

image

అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న వర్షాలకు పట్టణం, పరిసర గ్రామాల్లో రహదారులు అస్తవ్యస్తంగా మారాయి. రోడ్లు నీట మునగడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో పారిశుధ్య పరిస్థితులు దారుణంగా మారి, వర్షపునీరు, మురుగు కలసి కాలువల నుండి బయటకు పొంగి దుర్వాసన వ్యాపిస్తోంది. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

News October 23, 2025

వరంగల్: మార్కెట్ సమస్యలు పట్టడం లేదా..?

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్, లక్ష్మిపురం కూరగాయ, పండ్ల మార్కెట్లు, ముసలమ్మకుంట మామిడి మార్కెట్ హాల్‌లో కనీస సౌకర్యాలు లేక రైతులు ఆగ్రహంలో ఉన్నారు. మంత్రి కొండా సురేఖ, మార్కెటింగ్ శాఖ కమిషనర్ హామీలు ఇప్పటివరకు అమలు కావట్లేదు. సీసీ కెమెరాలు కూడా లేకపోవడంతో సురక్షితత సమస్య ఉంది. జిల్లా రైతులు మంత్రి, ఎమ్మెల్యేలను సమస్య పరిష్కరించేందుకు మాముల మార్కెట్‌ను పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు.