News May 24, 2024

వరంగల్: స్ట్రాంగ్ రూమ్ భద్రతను ఆకస్మిక తనిఖీ చేసిన వరంగల్ సీపీ

image

ఇటీవల పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎనుమాముల మార్కెట్లో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల కు ఏర్పాటు చేసిన మూడు అంచెల భద్రతను సీపీ అంబర్ కిషోర్ ఝా గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. కేంద్ర బలగాలు మరియు స్థానిక పోలీసులు నిర్వహిస్తున్న విధులపై సీపీ క్షేత్రస్థాయిలో పరిశీలించడంతోపాటు స్ట్రాంగ్ రూమ్‌లు మరింత భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్ అధికారులకు సూచించారు

Similar News

News October 1, 2024

వరంగల్: మార్కెట్లో పత్తి ధరల వివరాలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర తటస్తంగా ఉంది. సోమవారం క్వింటా పత్తి ధర రూ. 7450 పలకగా… నేడు కూడా అదే ధర పలికింది. అలాగే ఈరోజు మార్కెట్ తరలిరాగా రూ. 6910 ధర వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే గత వారంతో పోలిస్తే ధరలు పడిపోయాయని వ్యాపారులు తెలుపుతున్నారు. మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతోంది.

News October 1, 2024

డీఎస్సీ ఫలితాల్లో సత్తాచాటిన నల్లబెల్లి వాసులు

image

నిన్న విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో నల్లబెల్లి మండల వాసులు సత్తాచాటారు. నల్లబెల్లికి చెందిన మూటిక ప్రవళిక స్కూల్ అసిస్టెంట్ సైన్స్ విభాగంలో 2 వ ర్యాంకు, ఎస్జీటీ విభాగంలో 7 వ ర్యాంకు కొండ్లె వినయ్, 14వ ర్యాంకు రాయరాకుల రాజేష్, 54వ ర్యాంకు కొండ్లె నాగలక్ష్మి, నారక్క పేట నుండి 70వ ర్యాంక్ వైనాల రవి, 73వ ర్యాంకు అనుముల శ్రీలత డీఎస్సీ ఫలితాల్లో ర్యాంకులు సాధించారు. వీరిని బంధువులు అభినందించారు.

News October 1, 2024

ములుగు జిల్లాలో ఆకాశంలో అద్భుత దృశ్యం

image

ములుగు జిల్లాలో ఆకాశంలో వింత ఘటన చోటు చేసుకుంది. సోమవారం వెంకటాపురంలో ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఉదయం ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. సాయంత్రం మేఘాలలో మార్పు రావడంతో మేఘం వింతగా కనిపించింది. ఈ దృశ్యాన్ని పలువురు ఫోనులో బంధించారు. ఇలా మేఘంలో మార్పు రావడానికి దేనికైనా సంకేతమా..? లేక మామూలుగా జరిగిందన్న విషయంపై మండలంలో తీవ్రంగా చర్చ జరుగుతుంది.