News February 25, 2025
వరంగల్: స్పెషల్ బస్సుల టికెట్ ఛార్జీలు ఇలా..!

మహా శివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటు ఆయా బస్టాండ్ల నుంచి శైవ క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. వరంగల్ నుంచి ఐనవోలుకు రూ.50, మెట్టుగుట్టకు రూ.50, హనుమకొండ నుంచి వేములవాడకు రూ.210, కాళేశ్వరానికి రూ.250, రామప్పకు రూ.140, పాలకుర్తికి రూ.90, తొర్రూరు నుంచి పాలకుర్తికి రూ.100, మహబూబాబాద్ నుంచి కురవికి రూ.30, జనగామ నుంచి కొమురవెల్లికి రూ.100 టికెట్ ధరలను తీసుకోనున్నారు.
Similar News
News November 23, 2025
DEC నెలాఖరుకు రాష్ట్రంలో గుంతల్లేని రోడ్లు: చంద్రబాబు

AP: డిసెంబర్ నెలాఖరుకు రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు దర్శనమివ్వాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. R&B రహదారుల అభివృద్ధిపై ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. రోడ్ల అభివృద్ధి, మరమ్మతులను ప్రత్యక్షంగా తనిఖీ చేయాలని మంత్రి, స్పెషల్ సీఎస్లను ఆదేశించారు. పనులు చేపట్టని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏడాదిలోనే రూ.2500 కోట్లతో 5,471KM రోడ్ల అభివృద్ధికి అనుమతులిచ్చామన్నారు.
News November 23, 2025
నగరానికి CC శాపం.. బడ్జెట్కు భారం!

పెండింగ్ పనుల్లో సిమెంట్ కాంక్రీట్ (CC) రోడ్ల వాటా ఊహించని విధంగా ఉంది. ఈ కీలకమైన పనుల్లో జాప్యం వల్లే మొత్తం ఆర్థిక భారం పెరిగిపోయింది: 1,952 CC రోడ్ల పనులు పూర్తి కావాల్సి ఉంది. <<18363524>>వీటి అంచనా వ్యయం<<>> రూ.54,384.26 లక్షలు (సుమారు ₹543 కోట్లు). కేవలం 110 BT పనులకే రూ.6,419.91 లక్షలు పెండింగ్ ఉంది. మొత్తం రూ.608 కోట్ల పెండింగ్లో రూ.543 కోట్లు సీసీ రోడ్లకే కావడం గమనార్హం.
News November 23, 2025
భూపాలపల్లి జిల్లాలో శనివారం ముచ్చట్లు

✓ భూపాలపల్లి DCC అధ్యక్షుడిగా భట్టు కర్ణాకర్
✓ భూపాలపల్లి: టెన్త్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలి: కలెక్టర్
✓ మృతదేహంతో కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగిన తోటి కార్మికులు
✓ భూపాలపల్లి ఆసుపత్రిలో ఇద్దరు గర్భిణులకు ఒకటే బెడ్
✓ కాళేశ్వరం లో భక్తుల సందడి
✓ చిన్న కాళేశ్వరం పనులపై కలెక్టర్ సమీక్ష
✓ వే 2న్యూస్ కథనానికి స్పందించి గుంతలు పూడ్చిన అధికారులు


