News February 20, 2025
వరంగల్: స్వల్పంగా పెరిగిన మిర్చి ధరలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే నేడు మిర్చి ధరలు స్వల్పంగా పెరిగాయి. క్వింటా తేజ మిర్చి ధర బుధవారం రూ.13,400 పలకగా.. నేడు రూ.13,600కి పెరిగింది. అలాగే వండర్ హాట్ (WH) మిర్చి నిన్న రూ.16,100 ధర రాగా.. ఈరోజు రూ. 16,300 కి పెరిగింది. మరోవైపు 341 రకం మిర్చికి నిన్నటిలాగే ఈరోజు కూడా రూ.13,300 ధర వచ్చింది.
Similar News
News December 8, 2025
జిల్లా వైద్య సేవల్లో సమర్థతకే తొలి ప్రాధాన్యం: సూర్యాపేట డీఎంహెచ్వో

జిల్లాలో వైద్య, ఆరోగ్య సేవలను సమర్థవంతంగా అందిస్తామని డీఎంహెచ్వో వెంకట రమణ తెలిపారు. తమ శాఖ ఆధ్వర్యంలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ కార్యక్రమాన్ని ప్రత్యేక బృందాలతో పర్యవేక్షిస్తున్నామన్నారు. నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ కేంద్రాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డా.చంద్రశేఖర్ నేతృత్వంలో పట్టణంలో ప్రైవేట్ ఆస్పత్రుల ఛార్జీల వసూళ్లు, రికార్డులను తనిఖీ చేశారు.
News December 8, 2025
విదేశాల్లో వాస్తు పాటిస్తారా?

‘వాస్తు నియమాలు నిర్ధిష్ట ప్రాంతానికి పరిమితం కాదు. ప్రపంచంలో ఎక్కడ నివసించినా, వ్యక్తిగత అలవాట్లు వేర్వేరుగా ఉన్నా, పంచభూతాల నియమాలు ఎవరూ విస్మరించలేరు. ప్రపంచంలో వాస్తు సూత్రాలను నిర్లక్ష్యం చేస్తే అది జీవన మనుగడకే ముప్పుగా మారొచ్చు. వాస్తును ప్రాంతాల వారీగా విభజించడం, ఓ ప్రాంతానికే పరిమితం చేయడం అపోహ మాత్రమే. ఈ నియమాలు విశ్వమంతటా పాటించదగినవి’ అని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు.
News December 8, 2025
ఎరీన స్పోర్ట్స్ ఫెస్టివల్లో ఏఎన్యూ విద్యార్థుల సత్తా

మంగళగిరిలో నిర్మల ఫార్మసీ కళాశాల నిర్వహించిన ఎరీన 2025 స్పోర్ట్స్ ఫెస్టివల్లో ANU విద్యార్థులు సత్తా చాటారు. ఖోఖో ఉమెన్లో ప్రథమ, 100 మీటర్ల రిలే రన్నింగ్ ప్రథమ, చెస్లో ద్వితీయ స్థానాలు సాధించి బహుమతులు అందుకున్నారు. విజేతలను వర్సిటీ వీసీ గంగాధరరావు అభినందించారు. భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


