News February 11, 2025
వరంగల్: హెలికాప్టర్ ద్వారా భూ సర్వే నిర్వహించిన కలెక్టర్

WGL జిల్లాలో హెలికాప్టర్ ద్వారా డిజిటల్ ఏరియల్ భూ సర్వే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రక్రియను KZPT నుంచి కలెక్టర్ సత్య శారద హెలికాప్టర్లో వర్ధన్నపేటకు బయల్దేరి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ‘నక్ష’ ప్రాజెక్టులో భాగంగా వర్ధన్నపేట మున్సిపాలిటీలోని చెరువులు, కాల్వలు తదితర వివరాలతో అక్షాంశాలు, రేఖాంశాలుగా సంబంధిత ప్రాంతాన్ని నమోదు చేస్తారన్నారు. మంగళవారంలోగా సర్వే పూర్తవుతుందని పేర్కొన్నారు.
Similar News
News March 25, 2025
KU: నేటితో ముగియనున్న డిగ్రీ పరీక్ష ఫీజు గడువు

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు నేటితో ముగుస్తుందని KU అధికారులు తెలిపారు. విద్యార్థులు త్వరగా ఫీజు చెల్లించాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థి తమ అపార్ ఐడీని ఆధార్ కార్డ్ జిరాక్స్ను కళాశాలల్లో ఇచ్చి లింక్ చేసుకోవాలని పేర్కొన్నారు.
News March 25, 2025
భీమదేవరపల్లి: తెల్లవారుజామున యాక్సిడెంట్.. ఒకరి మృతి

భీమదేవరపల్లి మండలం ముల్కనూర్- ఎల్కతుర్తి రహదారిపై మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న కనకపూడి కర్ణాకర్ అనే పాస్టర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 25, 2025
కొత్త క్యాబినెట్.. వరంగల్కు దక్కని అవకాశం!

మంత్రి వర్గ విస్తరణలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఈసారి ఛాన్స్ దక్కలేదని తెలుస్తోంది. ఢిల్లీలో ఈ అంశంపై ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే సీతక్క, సురేఖ మంత్రివర్గంలో ఉన్నారు. కాగా WGL జిల్లాకు చెందిన MLA, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తనకు మంత్రి పదవి కావాలని పార్టీ పెద్దలను పలుమార్లు కలిశారు. కానీ ఆయన పేరు కూడా లిస్టులో లేకపోవడంతో ఆ పార్టీ నేతలు నిరాశలో ఉన్నట్లు తెలిసింది.