News February 18, 2025

వరంగల్: 16 ఏళ్ల తర్వాత నెరవేరిన కల!

image

వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామానికి చెందిన చిలుముల రాములు తేజ దంపతుల కొడుకు ఏలియా. చిన్నతనం నుంచే టీచర్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 2008 డీఎస్సీ అభ్యర్థులను కాంట్రాక్ట్ ఎస్జీటీలుగా నియమించింది. చిలుముల ఏలియాకు దాదాపు 16 ఏళ్ల తర్వాత ఉద్యోగం రావడంతో వారి ఆనందానికి హద్దులు లేవు. కొడుకు కల నెరవేరిందని సంతోష పడుతున్నారు.

Similar News

News March 21, 2025

మహబూబ్‌నగర్: ‘రక్షణ చర్యలు చేపట్టని విద్యుత్ శాఖ’

image

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో ట్రాన్స్‌ఫార్మర్లకు చుట్టూ కంచెలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రస్తుతం అవి ప్రమాదకరంగా మారాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పట్టణంలోని బండమీదిపల్లి, తెలంగాణ చౌరస్తా, పోలీస్ లైన్ తదితర జనావాసాలు,స్కూళ్లు ఉన్న ప్రాంతాల్లో రహదారులకు ఆనుకుని ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు ప్రమాదకరంగా ఉన్నాయన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News March 21, 2025

GST: ఏ శ్లాబ్‌రేటులో ఎంత ఆదాయం వస్తుందంటే..

image

GSTలో 5%, 12%, 18%, 28% శ్లాబ్‌రేట్లు ఉన్నాయి. విలువ, ప్రజలపై పన్ను భారాన్ని బట్టి వస్తు, సేవలను ఆయా శ్లాబుల్లో నమోదు చేశారు. 5% శ్లాబ్‌రేటు ద్వారా ప్రభుత్వానికి 8% ఆదాయం వస్తుంది. 12% శ్లాబ్ నుంచి అతి తక్కువగా 5%, పెద్ద శ్లాబ్ 28% ద్వారా 12.5% రాబడి వస్తుంది. కీలకమైన 18% శ్లాబ్ రేటు ద్వారా ఏకంగా 73% పన్ను ఆదాయం లభిస్తుంది. కొన్ని వస్తువులపై ఎలాంటి పన్నూ లేకపోవడం గమనార్హం.

News March 21, 2025

ASF: పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

image

ఆసిఫాబాద్ జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అధికారులకు సూచించారు. శుక్రవారం జనకాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాన్ని ఆసిఫాబాద్ మండల అధికారి లోకేశ్వర్ రావుతో కలిసి తనిఖీ చేశారు. కాగా జిల్లాలో 36 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

error: Content is protected !!