News June 15, 2024

వరంగల్: 60 కొత్త బస్సులకు ప్రతిపాదనలు

image

మహిళలకు ఉచిత ప్రయాణం నేపథ్యంలో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ పరిధిలోని ప్రయాణికుల సౌకర్యార్థం 60 నూతన బస్సుల కోసం ప్రభుత్వానికి ఆర్టీసీ ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుతం జిల్లాలోని 9 డిపోల్లో 579 ప్రభుత్వ బస్సులు, 327 అద్దె బస్సులు నడుస్తున్నాయి. ప్రతిపాదనల మేరకు కొత్త బస్సులు వస్తే కొంత మేర బస్సుల్లో రద్దీ తగ్గే అవకాశం ఉంటుందని ప్రయాణికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News September 17, 2025

నర్సంపేట: నేషనల్ స్పేస్ సొసైటీలో నిహారిక ఫస్ట్..!

image

నర్సంపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న భూక్య నిహారిక నేషనల్ స్పేస్ సొసైటీ (USA) నిర్వహించిన “Road Map to Space Art Contest” డ్రాయింగ్ విభాగంలో ప్రపంచ స్థాయి మొదటి బహుమతి సాధించింది. ఈ సందర్భంగా నర్సంపేట MLA దొంతి మాధవ రెడ్డి భూక్య నిహారికను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

News September 17, 2025

WGL: పసుపు క్వింటా రూ.10,555

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం పలు రకాల చిరు ధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ క్వింటా రూ.6,530 ధర పలకగా, పచ్చి పల్లికాయ రూ.,4500 ధర పలికింది. అలాగే మక్కలు (బిల్టీ)కి రూ.2,300 ధర వచ్చింది. మరో వైపు దీపిక మిర్చి క్వింటా రూ.14 వేలు, పసుపు రూ.10,555 ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.

News September 17, 2025

వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్‌లో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనరేట్ పరిపాలన భవనం ప్రాంగణంలో పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, అదనపు డీసీపీలు రవి, ప్రభాకర్ రావు, సురేశ్ కుమార్, ఏసీపీలు, ఆర్‌ఐలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలతో పాటు వివిధ విభాగాల పోలీస్ అధికారులు పాల్గొన్నారు.