News April 5, 2025
వరంగల్ CGHSకు సిబ్బందిని నియమించండి: MP కావ్య

కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి రోలి సింగ్ను ఢిల్లీలో ఎంపీ డాక్టర్ కడియం కావ్య శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వరంగల్ CGHS వెల్నెస్ సెంటర్ ప్రారంభం కోసం వైద్య సిబ్బంది నియామకాన్ని వేగవంతం చేయాలని వినతి పత్రం అందించారు. సుమారు 12 వేల మంది కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు చికిత్స కోసం దూర ప్రయాణం చేయాల్సి వస్తోందని తెలిపారు. దీనిపై సానుకూల స్పందించినట్లు తెలిపారు.
Similar News
News October 14, 2025
ఇకపై అన్ని ఫ్యాక్టరీలలో మాక్ డ్రిల్: కలెక్టర్

జిల్లాలోని అన్ని ఫ్యాక్టరీలలో మాక్ డ్రిల్ నిర్వహించాలని కలెక్టర్ వెట్రి సెల్వి మంగళవారం ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఫ్యాక్టరీలలో ప్రమాదాలు సంభవించినప్పుడు కార్మికులు వాటి నుంచి బయటపడేలా, అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పించాలన్నారు. భద్రతా చర్యలపై ప్రతి ఫ్యాక్టరీ నుంచి 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలన్నారు. A కేటగిరిలో 4, B1లో 26, B2లో 6 మొత్తం 36 పరిశ్రమల భద్రతా ప్రమాణాలపై సమీక్షించారు.
News October 14, 2025
గ్రౌండ్లోకి గులాబీ బాస్!

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికను బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. కార్యకర్తల్లో మరింత ఊపు తీసుకొచ్చి, ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీ చీఫ్ కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు. నవంబర్ మొదటి వారంలో ప్రచారానికి రానున్నారు. ఎర్రవల్లిలో పార్టీ అభ్యర్థి సునీతకు Bఫారమ్ ఇచ్చిన సందర్భంగా కేసీఆర్ హామీ ఇచ్చినట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. సభలోనా? లేక రోడ్ షోలో పాల్గొంటారనేది తెలియాల్సి ఉంది.
News October 14, 2025
తెనాలి హత్య కేసులో నిందితుడి గుర్తింపు.. ప్రత్యేక బృందాలతో గాలింపు

తెనాలి చెంచుపేటలో ఉదయం జరిగిన తిరుపతిరావు హత్య కేసులో పోలీసులు కొన్ని కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. నిన్న రాత్రే బాధ్యతలు తీసుకున్న త్రీ టౌన్ సిఐ సాంబశివరావు ఉదయాన్నే హత్య జరగడంతో కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సిసి కెమెరాల ద్వారా అనుమానితుడిని గుర్తించి ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. పోలీస్ డాగ్ సింబా స్పాట్ నుండి పక్క వీధి మీదగా డొంకరోడ్డు ఎంట్రన్స్ వద్దకు వచ్చి ఆగింది.