News March 3, 2025
వరంగల్: COUNTING.. ముందంజలో పీఆర్టీయూ అభ్యర్థి

ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. సోమవారం ఉదయం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆర్జాలబావి దగ్గర గల గోదాంలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు ఉండగా మొదటి రౌండ్లో పీఆర్టీయూ అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి ముందంజలో ఉన్నారు. శ్రీపాల్ రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి, పూల రవీందర్ మధ్య పోటీ నెలకొంది.
Similar News
News November 14, 2025
జూబ్లీహిల్స్ కౌంటింగ్: అభ్యర్థి మృతి

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ వేళ విషాదం నెలకొంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ అన్వర్(40) నిన్న రాత్రి గుండెపోటుతో మరణించారు. ఎర్రగడ్డలో నివాసం ఉండే ఈయన అక్టోబర్ 22న నామినేషన్ వేశారు. ఎన్నికల అధికారులు ఆయన నామినేషన్ను యాక్సెప్ట్ చేయగా పోటీలో నిలిచారు. ఫలితాలకు ఒకరోజు ముందు మహమ్మద్ అన్వర్ మరణించడంతో ఆయన అనుచరులు విషాదంలో మునిగిపోయారు.
News November 14, 2025
జూబ్లీహిల్స్: సుమారు 75 శాతం పోలింగ్ నమోదైన బూత్లు నాలుగే!

జూబ్లీహిల్స్ బైపోల్ పోలింగ్ మొత్తం 407 బూత్లల్లో జరిగింది. కాగా ఇందులో 20-30 శాతం పోలింగ్ నమోదైన కేంద్రం 1 కాగా 71 కేంద్రాల్లో 31-40%, 143 కేంద్రాల్లో 41-50%, 158 కేంద్రాల్లో 51-60%, 30 కేంద్రాల్లో 61-70%, 4కేంద్రాల్లో 71-75% పోలింగ్ నమోదైంది. అయితే 60 శాతం కంటే ఎక్కువ పోలింగ్ నమోదైన 34కేంద్రాల్లో రహమత్నగర్ 16, బోరబండ 13, షేక్పేట్ 2, ఎర్రగడ్డ 3 ఉన్నాయి. వీటిల్లో 18చోట్ల మహిళలే అధికంగా ఓటేశారు.
News November 14, 2025
వరంగల్: కుడా భూముల వేలం వాయిదా

కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) భూముల వేలం ఈ నెల 14న నిర్వహించాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు కుడా వైస్ ఛైర్పర్సన్ చాహత్ బాజ్ పాయ్ తెలిపారు. హనుమకొండ బాలసముద్రంలోని సర్వే నం. 1016/5లోని 12,957 చదరపు గజాల ప్రభుత్వ స్థలం వేలం నిలిపివేశారు. కొత్త తేదీని తరువాత ప్రకటిస్తామని ఆమె స్పష్టం చేశారు.


