News March 3, 2025

వరంగల్: COUNTING.. ముందంజలో పీఆర్టీయూ అభ్యర్థి

image

ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. సోమవారం ఉదయం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆర్జాలబావి దగ్గర గల గోదాంలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు ఉండగా మొదటి రౌండ్‌లో పీఆర్టీయూ అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి ముందంజలో ఉన్నారు. శ్రీపాల్ రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి, పూల రవీందర్ మధ్య పోటీ నెలకొంది.

Similar News

News November 13, 2025

షమీపై లక్నో, ఢిల్లీ ఆసక్తి

image

SRH స్టార్ బౌలర్ మహమ్మద్ షమీని దక్కించుకునేందుకు లక్నో, ఢిల్లీ ఆసక్తిగా ఉన్నాయని Cricbuzz తెలిపింది. నవంబర్ 15తో రిటెన్షన్ డెడ్‌లైన్ ముగియనుండగా SRH షమీని వదులుకోవచ్చని పేర్కొంది. గత వేలంలో హైదరాబాద్ రూ.10 కోట్లకు షమీని కొనుగోలు చేసింది. కానీ అతడు కేవలం 6 వికెట్లు మాత్రమే తీశారు. గత వేలంలో షమీ కోసం లక్నో రూ.8.5 కోట్ల వరకు వెళ్లింది. అటు ఢిల్లీ యాజమాన్యంలో భాగమైన గంగూలీ షమీపై ప్రశంసలు కురిపించారు.

News November 13, 2025

మక్తల్‌లో డిగ్రీ ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్

image

మక్తల్‌లో డిగ్రీ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి చొరవతో పాలమూరు యూనివర్సిటీ అనుమతి ఇచ్చింది. దీంతో మక్తల్, కృష్ణ, మాగనూరు, నర్వ, ఉట్కూరు ప్రాంతాల విద్యార్థులు ఇకపై నారాయణపేట వెళ్లే ఇబ్బంది తప్పింది. త్వరలో డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనం కూడా సిద్ధమవుతుందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.

News November 13, 2025

తిరుమల: ఘంటా మండపం విశిష్టత ఏంటంటే..?

image

తిరుమల సోపాన మార్గంలోని అవ్వాచారి కోనకు దగ్గరగా ఉండే ఘంటా మండపం శ్రీవారి నైవేద్య సమయాన్ని సూచిస్తుంది. 1630 ప్రాంతంలో వెంకటగిరి రాజు రఘునాథ యాచమ నాయకులు ఈ ఘంటను చంద్రగిరి రాజు రామదేవరాయలకు బహూకరించారు. తిరుమలలో స్వామివారికి నైవేద్యం పెట్టేటప్పుడు మోగే గంటల ధ్వని ఈ మండపంలోని గంటలను తాకగానే, అవి మోగేవి. ఈ శబ్దం వినిపించాకే చంద్రగిరిలోని రాజు భోజనం చేసేవారని ప్రతీతి. <<-se>>#VINAROBHAGYAMU<<>>