News April 4, 2025
వరంగల్- HYD పుష్-పుల్ ట్రైన్ నడపండి.. ఎంపీ కావ్య విజ్ఞప్తి

ఉదయం వేళ వరంగల్ నుంచి హైదరాబాద్కు పుష్పుల్ రైలు నడపాలని శుక్రవారం వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు. ఈమేరకు పార్లమెంట్లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆమె మాట్లాడుతూ.. పేద మధ్యతరగతి ప్రజలు రోజువారి పనుల నిమిత్తం హైదరాబాద్కు వెళ్తుంటారని, వారికి సౌకర్యార్థంగా రైలులు నడపాలని వివరించారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు.
Similar News
News October 16, 2025
జగిత్యాల: ‘పెన్షనర్ల బకాయిల కోసం రాజీలేని పోరాటం’

పెన్షనర్ల బకాయిల చెల్లింపుల కోసం TGE JAC ఆధ్వర్యంలో రాజీలేని పోరాటం కొనసాగుతుందని తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలో జరిగిన TPCA సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు రిటైర్డ్ ఉద్యోగులను సన్మానించారు. కార్యక్రమంలో హన్మంత్ రెడ్డి, గౌరీశెట్టి విశ్వనాథం, ప్రకాష్ రావు, యాకూబ్, గంగాధర్, వేణుగోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.
News October 16, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. 4వ రోజు 19 మంది నామినేషన్లు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గురువారం కొత్తగా 19 మంది క్యాండిడేట్లు 21 నామినేషన్లు వేసినట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.
News October 16, 2025
‘టెస్ట్ 20’.. క్రికెట్లో సరికొత్త ఫార్మాట్

టెస్ట్, టీ20ల కలయికతో ‘టెస్ట్ 20’ అనే సరికొత్త ఫార్మాట్ రాబోతోంది. ఇందులో రెండు జట్లు 20 ఓవర్ల చొప్పున ఒకే రోజు 2 ఇన్నింగ్స్లు ఆడతాయి. టెస్టు మ్యాచ్లా 2సార్లు బ్యాటింగ్ చేయొచ్చు. 2026 JANలో ‘జూనియర్ టెస్ట్ 20 ఛాంపియన్షిప్’ తొలి సీజన్ నిర్వహించనున్నట్లు ఈ ఫార్మాట్ ఫౌండర్ గౌరవ్ బహిర్వాని తెలిపారు. దీనికి మాజీ ప్లేయర్స్ ఏబీ డివిలియర్స్, క్లైవ్ లాయిడ్, హెడెన్, హర్భజన్ సలహాదారులుగా ఉన్నారు.