News April 4, 2025

వరంగల్- HYD పుష్-పుల్ ట్రైన్ నడపండి.. ఎంపీ కావ్య విజ్ఞప్తి

image

ఉదయం వేళ వరంగల్ నుంచి హైదరాబాద్‌కు పుష్పుల్ రైలు నడపాలని శుక్రవారం వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు. ఈమేరకు పార్లమెంట్‌లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆమె మాట్లాడుతూ.. పేద మధ్యతరగతి ప్రజలు రోజువారి పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్తుంటారని, వారికి సౌకర్యార్థంగా రైలులు నడపాలని వివరించారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు.

Similar News

News November 10, 2025

ధర్మేంద్ర హెల్త్‌పై రూమర్స్.. టీమ్ క్లారిటీ

image

బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ <<18162519>>ధర్మేంద్ర<<>> ఇటీవల శ్వాస సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం క్షీణించిందని, మళ్లీ ఆస్పత్రికి వెళ్లగా వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారని జాతీయ మీడియా పేర్కొంది. వాటిని నటుడి టీమ్ ఖండించింది. ‘ఆయన కోలుకుంటున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముంబైలోని ఆస్పత్రికి రొటీన్ చెకప్‌కు వెళ్లగా ఇలాంటి వార్తలు వచ్చాయి’ అని క్లారిటీ ఇచ్చారు.

News November 10, 2025

న్యూస్ రౌండప్

image

*రేపు HYD ఘట్కేసర్ NFC నగర్‌లో అందెశ్రీ అంత్యక్రియలు. హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి
*దేవాలయాల్లో తొక్కిసలాట నివారణకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం
*శంషాబాద్ విమానాశ్రయంలా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్. 2.70 లక్షల ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా పునర్నిర్మాణం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
*లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

News November 10, 2025

వేములవాడ: రాజన్న కళ్యాణం.. అరకొర టికెట్లతో నిరాశలో భక్తులు

image

వేములవాడ రాజన్న నిత్యకళ్యాణం టికెట్ల విషయంలో భక్తులు నిరాశకు లోనవుతున్నారు. గతంలో విశాల కళాభవనంలో భక్తులు నిత్యకళ్యాణం మొక్కులు చెల్లించేవారు. ఆలయ విస్తరణ నేపథ్యంలో భీమేశ్వరాలయం ఎదురుగా ఉన్న నిత్యఅన్నదాన సత్రం పైఅంతస్తులో ఈ క్రతువును జరిపిస్తున్నారు. గతంలో 150 జంటలకు టికెట్లు ఇచ్చేవారు. ప్రస్తుతం దానిని 90కి తగ్గించేశారు. టికెట్లు తీసుకునే సమయంలో ఇక్కడ తోపులాట సైతం జరుగుతుందని పలువురు పేర్కొన్నారు.