News February 26, 2025
వరంగల్: MGM ఆస్పత్రి నుంచి పారిపోయాడు..!

వరంగల్ MGM ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి ఎవరికీ చెప్పకుండా పారిపోయాడు. ఈ విషయమై ఆస్పత్రిలో ఉన్న అతడి తల్లి లక్ష్మీ స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేసింది. భూపాలపల్లి జిల్లాకు చెందిన పద్మాకర్ అనారోగ్య రీత్యా ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ తరుణంలో ఎవరికీ చెప్పకుండా ఎంజీఎం నుంచి పారిపోయాడు. ఎవరికైనా ఆచూకీ తెలిసినట్లయితే మాట్వాడ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
Similar News
News November 12, 2025
జూబ్లీ వార్.. ఆయనదే గెలుపు.. కాదు కాదు ఆమెదే

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బెట్టింగ్ రాయుళ్లకు పండుగలా మారింది. గెలుపోటములపై ఖమ్మం జిల్లాలో బెట్టింగ్ జోరుగా సాగుతోంది. దీనిపై రూ. వేల నుంచి రూ. లక్షల్లో బెట్టింగ్ పెడుతున్నట్లు తెలుస్తోంది. కొందరు మొబైల్ యాప్లలో, మరి కొందరు వాట్సాప్ గ్రూపుల్లో పందేల వివరాలపై చాటింగ్ జరుపుతున్నట్లు టాక్. ఎన్నిక ఫలితం వెలువడే నాటికి రూ.లక్షల్లో చేతులు మారే అవకాశముందని సమాచారం. ఈ ఉపఎన్నిక ఫలితం 14న వెలువడనుంది.
News November 12, 2025
వేములవాడ: శృంగేరి పీఠాధిపతి చేతుల మీదుగా ప్రచార రథం ప్రారంభం

వేములవాడ రాజన్న ఆలయ ఆవరణలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని శృంగేరి పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతి స్వామి ప్రారంభించారు. ఆలయ అభివృద్ధి పనులను దృష్టిలో ఉంచుకొని ప్రచార రథంలో శ్రీ స్వామివారి ఉత్సవా విగ్రహాలను దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేసి, పక్కనే ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు. గత నెల 20వ తేదీన శృంగేరి పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతి స్వామి దీనిని ప్రారంభించారు.
News November 12, 2025
ఎల్ఈడీ తెరపై వేములవాడ రాజన్న దర్శనం

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులు ఈరోజు నుంచి ఎల్ఈడీ తెరపై రాజన్నను దర్శించుకోనున్నారు. ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో బుధవారం నుంచి భక్తులకు దర్శనాలను నిలిపివేశారు. ఈ క్రమంలో ఆలయ ముందు భాగంలో టెంట్ కింద శ్రీ స్వామివారి ప్రచార రథం, ఎల్ఈడీ తెర ఏర్పాటు చేశారు. భక్తులు ప్రచారరథంలో ఉత్సవ విగ్రహాలను మొక్కుకొని ఎల్ఈడీ తెరపై గర్భాలయంలోని శ్రీ స్వామివారిని దర్శించుకుంటారు.


