News February 26, 2025

వరంగల్: MGM ఆస్పత్రి నుంచి పారిపోయాడు..!

image

వరంగల్ MGM ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి ఎవరికీ చెప్పకుండా పారిపోయాడు. ఈ విషయమై ఆస్పత్రిలో ఉన్న అతడి తల్లి లక్ష్మీ స్థానిక పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేసింది. భూపాలపల్లి జిల్లాకు చెందిన పద్మాకర్ అనారోగ్య రీత్యా ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ తరుణంలో ఎవరికీ చెప్పకుండా ఎంజీఎం నుంచి పారిపోయాడు. ఎవరికైనా ఆచూకీ తెలిసినట్లయితే మాట్వాడ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Similar News

News December 4, 2025

సాయుధ దళాల పతాక వాల్ పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

image

డిసెంబర్ 7న సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ కె.వెట్రి సెల్వి గురువారం వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె సాయుధ దళాల పతాక నిధికి మొదటి విరాళాన్ని అందజేశారు. భారత సైనిక దళాల దేశభక్తి, సాహసం, త్యాగాల పట్ల దేశం గర్విస్తుందని కలెక్టర్ అన్నారు. ఇటీవల జరిగిన ‘ఆపరేషన్ సింధూరం’, ప్రకృతి వైపరీత్యాల సమయంలోను సైనికులు దేశం గర్వించేలా కృషి చేశారని కొనియాడారు.

News December 4, 2025

జలజీవన్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ నాగరాణి

image

జిల్లాలో జలజీవన్ మిషన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు సంబంధిత శాఖలు సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో తాగునీటి సరఫరా ప్రాజెక్టు ఏర్పాటు పనులపై సంబంధిత శాఖలతో ఆమె సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు ప్రస్తుత స్థితిగతులను, పురోగతిని గుత్తేదారు సంస్థ ప్రతినిధి, మేఘా కంపెనీ డీజీఎం వాసు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమావేశంలో వివరించారు.

News December 4, 2025

టోల్ ప్లాజాస్ @ 25 ఇయర్స్

image

దేశంలో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం(PPP)లో టోల్ ప్లాజాలు ఏర్పాటై 25 ఏళ్లు అయింది. ప్రభుత్వ రహదారులు, బ్రిడ్జిలపై టోల్ వసూలుకు 1851లో చట్టం చేశారు. 1970లలో దేశంలో రహదారుల నిర్మాణం, టోల్ వసూలు పద్ధతులు ప్రవేశపెట్టారు. 2000 నుంచి ప్రారంభమైన టోల్ ప్లాజాల ద్వారా ప్రభుత్వానికి ప్రతి ఏడాది భారీగా ఆదాయం వస్తోంది. 2024-25లో రూ.73 వేల కోట్లు వసూలవగా.. ఈ ఏడాది రూ.80 వేల కోట్లు వసూలు కావొచ్చని అంచనా.