News March 25, 2024

వరదయ్యపాళెం: అక్క మరణాన్ని తట్టుకోలేక దివ్యాంగుడి ఆత్మహత్య

image

మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన బీఎన్ కండ్రిగ మండలంలో చోటుచేసుకుంది. SI ప్రతాప్ వివరాల ప్రకారం.. కంచనపుత్తూరునకు చెందిన ప్రత్యేక ప్రతిభావంతుడైన బాలమురుగయ్య (26) మండలంలోని ఇందిరానగర్ పంచాయతీ పద్మావతిపురంలో నివాసముంటూ వరదయ్యపాళెం SBI ఎదురుగా నెట్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. ఇటీవల అక్క హత్యకు గురికాగా మనస్తాపానికి గురై పురుగుమందు తాగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Similar News

News October 20, 2025

చిత్తూరులో PGRS రద్దు

image

దీపావళి పండుగ కారణంగా సోమవారం కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయంలో జరగాల్సిన PGRS కార్యక్రమాలను రద్దు చేశారు. ప్రజలు ఎవరూ వ్యయ ప్రయాసల కోర్చి జిల్లా కేంద్రానికి రావద్దని కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడీ ఒక ప్రకటనలో సూచించారు.

News October 20, 2025

ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం: చిత్తూరు SP

image

జిల్లాలో ప్రజాసేవ కోసం పోలీసు సిబ్బంది ఎలా వేళల అందుబాటులో ఉంటారని SP తుషార్ డూడీ ఆదివారం తెలిపారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురైనా పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగను సుఖ సంతోషాలతో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.

News October 19, 2025

ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం: చిత్తూరు SP

image

జిల్లాలో ప్రజాసేవ కోసం పోలీసు సిబ్బంది ఎలా వేళల అందుబాటులో ఉంటారని SP తుషార్ డూడీ ఆదివారం తెలిపారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురైనా పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగను సుఖ సంతోషాలతో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.