News September 3, 2024
వరదల్లో చిక్కుకున్న ఎమ్మెల్యే సోమిరెడ్డి

సింహపురి ఎక్స్ప్రెస్ మహబూబాబాద్లో ఆగిపోవడంతో సర్వేపల్లి MLA సోమిరెడ్డి ప్రయాణానికి ఆటంకం ఏర్పడింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారంతో మున్సిపల్ ఛైర్మన్ ఇంట్లో ఆతిథ్యం పొందారు. పద్మావతి ఎక్స్ప్రెస్లో ఖమ్మంకు బయలుదేరగా మార్గమధ్యలో రైలు నిలిచిపోయింది.దీంతో కారు, బైకులపై ఖమ్మంకు చేరుకుని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో బసచేశారు. అనంతరం కారులో హైదరాబాద్కు చేరుకున్నారు.
Similar News
News October 28, 2025
కృష్ణపట్నం పోర్టులో 5వ ప్రమాదపు హెచ్చరిక జారీ

‘మెంథా’ తుఫాన్ నేపథ్యంలో కృష్ణపట్నం పోర్టులో సోమవారం సాయంత్రం 5వ ప్రమాదవ హెచ్చరిక ప్రకటన చేశారు. తుపాను 50 నుంచి 150 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు 5, 6వ నంబరు ప్రమాదకర సూచికలుగా పరిగణిస్తారు. గాలులు, అలలు పోర్ట్ పరిసరాల్లో ప్రభావం చూపుతాయని అర్థం. ఈ నంబర్ల హెచ్చరికలు జారీచేస్తే పోర్టులో కార్యకలాపాలన్నీ నిలిపేయాలి. కృష్ణపట్నం పోర్టులో కార్మికులకు సెలవు ఇవ్వకపోవడంపై పలువురు మండిపడుతున్నారు
News October 27, 2025
జిల్లా రెవెన్యూ అధికారిగా విజయ్ బాధ్యతలు

నెల్లూరు జిల్లా రెవెన్యూ అధికారిగా విజయ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. సోమవారం కలెక్టరేట్లోని డీఆర్ఓ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించిన ఆయనకు కలెక్టరేట్ పరిపాలన అధికారి తుమ్మా విజయ్ కుమార్ బొకే అందించి అభినందించారు. అనంతరం పలు సమస్యలను అయన దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని విజయ్ తెలిపారు.
News October 27, 2025
రేపు జూనియర్ కళాశాలలకు సెలవు: నెల్లూరు RIO

నెల్లూరు జిల్లాలో మంగళవారం అన్ని జూనియర్ కళాశాలకు సెలవు ప్రకటించినట్లు RIO వరప్రసాద్ రావు తెలిపారు. ‘మెంథా తుఫాన్’ నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు సెలవు ప్రకటించామన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. కాగా ఇప్పటికే స్కూళ్లు, అంగన్వాడీలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.


