News September 6, 2024

వరద బాధితులను ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత: కలెక్టర్

image

వరద బాధితులను ఆదుకునేందుకు అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, స్వయం సహాయక సంఘాలు, మెప్మా ఆధ్వర్యంలో రూ. 80 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఆర్థిక సహాయం చెక్కును
గురువారం కలెక్టర్ నాగలక్ష్మికి అందజేశారు. వరద బాధితుల కోసం ప్రభుత్వ శాఖలు, స్వయం సహాయక సంఘాలు ముందుకు రావడం అభినందనీయమని కలెక్టర్ తెలిపారు. ఇదే తరహాలో అందరూ చొరవ చూపాలన్నారు.

Similar News

News May 8, 2025

గుంటూరు మిర్చి యార్డ్‌లో నేటి ధరలివే.! 

image

గుంటూరు మిరప మార్కెట్‌కు గురువారం 55,000 బస్తాల దిగుబడి నమోదైంది. వివిధ రకాల మిరప ధరలు ఇలా ఉన్నాయి. తేజా బెస్ట్ రూ.80-125, సూపర్ డీలక్స్ రూ.130. భెడిగి రకాలు (355, 2043) రూ.80-120 మధ్య, 341 బెస్ట్ రూ.80-130 మధ్య ట్రేడ్ అయ్యాయి. షార్క్ రకాలు రూ.80-110, సీజెంటా భెడిగి రూ.80-110, నం:5 రకం రూ.90-125 ధరలు పలికాయి. డి.డి రకం రూ.80-115, 273 రకం రూ.90-120, ఆర్ముర్ రకం రూ.75గా విక్రయించబడ్డాయి.  

News May 8, 2025

గుంటూరు: తగ్గుతున్న వేసవి బంధాలు  

image

వేసవి వచ్చిందంటే చాలు గతంలో పిల్లలంతా అమ్మమ్మల ఊళ్లకు పయనమయ్యేవారు. పొలాల్లో ఆటలు, తాతయ్యల సరదాలు.. ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగా ఉంటాయి. కానీ, నేటి తరం పిల్లలకు ఆ అనుభూతి అంతగా కలగడం లేదు. గతంలో వేసవి సెలవుల్లో బంధువుల కలయికతో సందడిగా ఉండేది. ఇప్పుడు ఆ సందడి కనుమరుగవుతోంది. తాతయ్యల ఒడిలో కథలు వినడం, అమ్మమ్మల చేతి గోరు ముద్దలు వంటివి అరుదుగా కనిపిస్తున్నాయి. మీకున్న జ్ఞాపకాలు ఎంటో COMMENT చేయండి.

News May 7, 2025

గుంటూరు జిల్లాలో భద్రతా తనిఖీలు 

image

జమ్మూకశ్మీర్ ఉగ్రదాడి ఘటనల నేపథ్యంలో డీజీపీ ఆదేశాల మేరకు శనివారం గుంటూరు జిల్లాలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ సతీశ్ కుమార్ నేతృత్వంలో బస్టాండ్‌లు, ఆటో స్టాండ్‌, మార్కెట్, రైల్వే స్టేషన్, లాడ్జీలు, హోటళ్లలో తనిఖీలు చేపట్టారు. అనుమానితుల వేలిముద్రలు పరిశీలించారు. వాహనాల రిజిస్ట్రేషన్, సరుకు వివరాలను పరిశీలించారు. అనుమానితులు కనిపిస్తే 112కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.