News September 25, 2024
వరద బాధితుల కోసం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ భారీ విరాళం
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) తరఫున వరద బాధితుల కోసం రూ.కోటి విలువ చేసే చెక్కును ఏసీఏ పాలకవర్గం సభ్యులు మంగళవారం సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని), కార్యదర్శి సానా సతీశ్ బాబు, ఉపాధ్యక్షుడు వెంకట రమణ ప్రశాంత్, కోశాధికారి దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్ డి.గౌర్ విష్ణు తేజ్లు విజయవాడలో సీఎం చంద్రబాబును కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం చెక్కును అందజేశారు.
Similar News
News September 29, 2024
ఏయూ: ‘అక్టోబర్ 7 నుంచి దసరా సెలవులు’
ఏయూతో పాటు అనుబంధ కాలేజీలకు దసరా సెలవులు ప్రకటిస్తూ రిజిస్ట్రార్ ఈ.ఎన్ ధనుంజయ రావు ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 7 (సోమవారం) నుంచి 12(శనివారం) వరకు దసరా సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. ఆదివారం కూడా సెలవు కావడంతో అక్టోబర్ 14(సోమవారం) తిరిగి తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
News September 29, 2024
అరకులో పాస్ పోర్టు ఆఫీస్..!
అరకులోయలో పాస్ పోర్టు ఆఫీస్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తపాలా శాఖ డివిజనల్ సూపరింటెండెంట్ సంజయ్ పాండా తెలిపారు. శనివారం ఆయన అరకులోయలోని ఉప తపాలా శాఖ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు పాస్ పోర్టు సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ మండలాల్లో ఉప తపాలా కార్యాలయాల ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు.
News September 29, 2024
విదేశాలలో తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట
అమెరికాలో గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం గోల్డెన్ జూబ్లీ వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు దంపతులు సంఘ సభ్యులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను విదేశాల్లో తెలుగు ప్రజలు ఇంత ఘనంగా నిర్వహించడం గర్వకారణం అని పేర్కొన్నారు. ఇంత చక్కని కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.