News September 13, 2024

వరద బాధితుల కోసం విశాఖ పోర్టు రూ.కోటి విరాళం

image

విజయవాడల వరద ప్రభావిత ప్రాంత ప్రజల సహాయార్థం విశాఖపట్నం పోర్టు అథారిటీ రూ.కోటి విరాళం ఇచ్చింది. పోర్ట్ కార్యదర్శి టి.వేణు గోపాల్, వివిధ విభాగాధిపతులు విశాఖ కలెక్టరేట్‌లో శుక్రవారం కలెక్టర్ ఎం.ఎన్.హరేంద్ర ప్రసాద్‌కు సంబంధిత నగదు చెక్‌ను అందజేశారు. కార్మిక సంఘాలు, ఉద్యోగులు తమ వంతు సహకారం అందజేశారని యాజమాన్యం తెలిపింది.

Similar News

News December 4, 2025

GVMC స్థాయి సంఘంలో ఇష్టారాజ్యంగా ప్రతిపాదనలు..

image

GVMC స్థాయి సంఘం సమావేశం శనివారం జరగనుంది. మొత్తం 257 అంశాలతో అజెండా కాపీలను సిద్ధం చేసి సభ్యులకు అందజేశారు. ఇన్ని అంశాలను ఒకే సారి పెట్టడం ద్వారా ఎలాంటి చర్చ లేకుండా అమోదించే అవకాశం ఉంది. దీంతో ఆయా అంశాలను స్థాయి సంఘం సభ్యులు పూర్తిగా చదివే అవకాశం కూడా లేకుండా పోతుంది. ప్రజాధనాన్ని అవసరం ఉన్నా.. లేకపోయినా ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

News December 4, 2025

విశాఖలో నేవీ అమరవీరులకు నివాళి

image

విశాఖ బీచ్ రోడ్డులోని ‘విక్టరీ ఎట్ సీ’ వద్ద తూర్పునౌకదళ అధికారులు, కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అమరులైన నావిక దళ వీరులకు నివాళులర్పించారు. రక్షణ వ్యవస్థలో తూర్పునౌకదళం కీలకంగా పనిచేస్తుందని వారు కొనియాడారు. నేవీ డే సందర్భంగా గురువారం ఉదయం ఈ కార్యక్రమం నిర్వహించారు. కాగా ఈ ఏడాది విశాఖలో నేవీ డే విన్యాసాలను నిర్వహించకపోవడంతో నగరవాసులు నిరుత్సాహానికి గురయ్యారు.

News December 4, 2025

జీవీఎంసీలో విలీనం కానున్న గ్రామీణ మండలాలివే..!

image

ఉమ్మడి విశాఖ జిల్లా విభజన అనంతరం మిగిలిపోయిన 4 మండలాలైన ఆనందపురం, పద్మనాభం, భీమిలి, పెందుర్తిని GVMCలో విలీనం చేసే ప్రక్రియ జరుగుతోంది. భీమిలి నియోజకవర్గ పరిధిలోని 3 గ్రామీణ మండలాలు (భీమిలి, పద్మనాభం, ఆనందపురం) GVMCలో కలిపేందుకు CM చంద్రబాబు, మంత్రులు నారా లోకేశ్, నారాయణ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ తెలిపారు. దీంతో GVMC పరిధి విస్తరణతో పాటు వార్డులు కూడా పెరగనున్నాయి.