News September 2, 2024

వరద ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

పెద్దపల్లి జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. సోమవారం ఆయన మంథని పట్టణంలోని గౌతమేశ్వర ఆలయ పరిసరాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీతో కలిసి పరిశీలించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కూడా నీరు విడుదలయ్యే అవకాశం ఉన్నందున మంథని పరిసర ముంపు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

Similar News

News November 25, 2025

NPDCL కరీంనగర్ సర్కిల్ POగా మునీందర్

image

NPDCL KNR సర్కిల్ ఇన్‌ఛార్జ్ పీవోగా S.మునీందర్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పీవోగా పనిచేసిన B.చంద్రయ్యకు అసిస్టెంట్ సెక్రటరీగా పదోన్నతి కల్పిస్తూ వరంగల్ సర్కిల్ కార్యాలయంలో పోస్టింగ్ ఇస్తూ సీఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో PO పోస్టుకు ఖాళీ ఏర్పడడంతో మునీందర్‌కు ఇన్‌ఛార్జ్ పీవోగా బాధ్యతలు అప్పగించారు. ఒక ADEకి DEగా, 10 మంది ఏఈలకు ADEలుగా, 5 మంది సబ్ ఇంజినీర్లకు ఏఈలుగా పదోన్నతి కల్పించారు.

News November 25, 2025

HZB: పేదలకు మెరుగైన వైద్యం అందజేయాలి: బండి

image

కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సోమవారం హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి సందర్శించారు. సుమారు కోటిన్నర రూపాయల విలువైన ఆధునిక వైద్య పరికరాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

News November 25, 2025

KNR: భవన నిర్మాణ కార్మికులకు అవగాహన సదస్సులు

image

భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై పది రోజుల పాటు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఉప కార్మిక కమిషనర్ తెలిపారు. లేబర్ కమిషనర్ హైదరాబాద్ ఆదేశాల మేరకు డిసెంబర్ 3 వరకు ఈ సదస్సులు జరుగుతాయి. ప్రమాద బీమా, సహజ మరణం, పెళ్లి కానుక, ప్రసూతి లబ్ధి వంటి అంశాలపై నిర్వహించే ఈ సదస్సులను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.