News August 17, 2024
వరికుంటపాడు: పిడుగుపాటుకు వ్యక్తి మృతి

వరికుంటపాడు మండలంలో శనివారం సాయంత్రం గాలి వాన బీభత్సం సృష్టించింది. జి కొత్తపల్లి గ్రామ సమీపంలో వరి నాటుతుండగా పిడుగు పడి కోటయ్య(47) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు ఒక భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
Similar News
News July 11, 2025
అక్టోబర్ 1కి అన్నీ పనులు ప్రారంభం: మంత్రి నారాయణ

నెల్లూరులోని అభివృద్ధి పనులపై టీడీపీ నేతలు, కార్పొరేషన్ అధికారులతో మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. నగర కార్పొరేషన్లో రూ.830 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టబోతున్నామన్నారు. ఇప్పటికే డ్రైన్లలో పూడికతీత పనులు జరుగుతున్నాయన్నారు. అక్టోబర్ 1వ తేదీ కల్లా అన్ని పనులు ప్రారంభం అవుతాయని చెప్పారు.
News July 11, 2025
నెల్లూరులో ప్రారంభమైన రెవెన్యూ క్రీడా వారోత్సవాలు

నెల్లూరు జిల్లా రెవెన్యూ అసోసియేషన్ 10వ క్రీడా వారోత్సవాలను జిల్లా జడ్జి శ్రీనివాసులు, కలెక్టర్ ఆనంద్ ప్రారంభించారు. శుక్రవారం ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, క్రీడాజ్యోతిని వెలిగించి ఆటలను ప్రారంభించారు. మూడు రోజులుపాటు ఈ క్రీడా వారోత్సవాలు జరగనున్నాయి. ఈ పోటీల్లో నెల్లూరు, ఆత్మకూరు, కావలి, కందుకూరు డివిజన్లలోని రెవెన్యూ సిబ్బంది పాల్గొననున్నారు.
News July 11, 2025
మనుబోలు: ఉదయాన్నే రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

మనుబోలు మండలం పల్లిపాలెం వద్ద శుక్రవారం ఉదయాన్నే జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. TPగూడూరు(M) గంగపట్నంకు చెందిన లక్ష్మయ్య (22) కట్టువపల్లిలో రొయ్యల గుంట వద్ద పని చేస్తున్నాడు. ఉదయాన్నే బైకుపై పల్లిపాలెం వెళ్తూ దారిమధ్యలో గేదె అడ్డు రావడంతో ఢీకొట్టాడు. తలకు గాయాలై తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు విచారణ చేపట్టారు.