News January 19, 2025
వరికూటి అశోక్ బాబుకి కీలక పదవి

కొండపి నియోజకవర్గానికి చెందిన వరికూటి అశోక్ బాబుకు వైసీపీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయన్ను వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించినట్లు పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. గతంలో కొండపి వైసీపీ ఇన్ఛార్జ్గా పనిచేసిన ఆయన ప్రస్తుతం వేమూరు వైసీపీ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు. అశోక్ బాబు నియామకం పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Similar News
News December 5, 2025
కొనకనమిట్ల : ఐదు సెకండ్ల పాటు కంపించిన భూమి!

కొనకనమిట్ల మండలంలోని పలు గ్రామాల్లో భూకంపం వచ్చినట్లు పలు గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3: 30 గంటల సమయంలో పెద్ద శబ్దంతో ఐదు సెకండ్ల పాటు భూమి కంపించినట్లు తెలిపారు. ఇళ్లలోని వస్తువులు సైతం కదిలినట్లు చెప్తున్నారు. ఆ సమయంలో నిద్రలో నుంచి లేచి భయాందోళనకు గురైనట్లు పేర్కొన్నారు.
News December 5, 2025
MRKP: ఈనెల 13న జాతీయ లోక్ అదాలత్

ఈనెల 13న మార్కాపురం కోర్ట్ ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహంచనున్నారు. 6 మండలాల పోలీసులతో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కిషోర్ కుమార్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి బాలాజీ గురువారం సమీక్షించారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా క్రిమినల్, సివిల్ కేసులు, వివాహ సంబంధ కేసులు, రాజీమార్గం ద్వారా పరిష్కరిస్తామన్నారు. కక్షిదారులు జాతీయలోక్ అదాలత్ను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
News December 5, 2025
MRKP: ఈనెల 13న జాతీయ లోక్ అదాలత్

ఈనెల 13న మార్కాపురం కోర్ట్ ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహంచనున్నారు. 6 మండలాల పోలీసులతో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కిషోర్ కుమార్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి బాలాజీ గురువారం సమీక్షించారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా క్రిమినల్, సివిల్ కేసులు, వివాహ సంబంధ కేసులు, రాజీమార్గం ద్వారా పరిష్కరిస్తామన్నారు. కక్షిదారులు జాతీయలోక్ అదాలత్ను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.


