News January 19, 2025

వరికూటి అశోక్ బాబుకి కీలక పదవి

image

కొండపి నియోజకవర్గానికి చెందిన వరికూటి అశోక్ బాబుకు వైసీపీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయన్ను వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించినట్లు పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. గతంలో కొండపి వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా పనిచేసిన ఆయన ప్రస్తుతం వేమూరు వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. అశోక్ బాబు నియామకం పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Similar News

News November 14, 2025

17న ఒంగోలులో కలెక్టర్ మీకోసం కార్యక్రమం

image

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 17వ తేదీన కలెక్టర్ మీకోసం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. గత సోమవారం కనిగిరి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా కలెక్టర్ మీకోసం కార్యక్రమాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే 17వ తేదీన ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జరిగే కలెక్టర్ మీకోసంలో ఆయన పాల్గొననున్నారు.

News November 14, 2025

17 నుంచి ప్రకాశం జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం

image

ఈనెల 17వ తేదీ నుంచి చేపట్టే చర్మరోగ పరీక్షల కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. ఇందుకు సంబంధించిన సమన్వయ కమిటీ సమావేశం శుక్రవారం ఒంగోలు ప్రకాశం భవనంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఏ రోగమైనా ప్రారంభ దశలోనే గుర్తిస్తే తగిన జాగ్రత్తలు, వైద్యం అందించేందుకు వీలుగా ఉంటుందన్నారు.

News November 14, 2025

సెల్ ఫోన్ వద్దు – పుస్తకం ముద్దు: ప్రకాశం కలెక్టర్

image

విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండి, పుస్తకాలకు చేరువ కావాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని శాఖ గ్రంథాలయంలో శుక్రవారం జిల్లా గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబు, మేయర్ గంగాడ సుజాత, పలువురు అధికారులు పాల్గొన్నారు. గ్రంథాలయాల ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాలన్నారు.