News January 19, 2025
వరికూటి అశోక్ బాబుకి కీలక పదవి

కొండపి నియోజకవర్గానికి చెందిన వరికూటి అశోక్ బాబుకు వైసీపీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయన్ను వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించినట్లు పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. గతంలో కొండపి వైసీపీ ఇన్ఛార్జ్గా పనిచేసిన ఆయన ప్రస్తుతం వేమూరు వైసీపీ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు. అశోక్ బాబు నియామకం పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Similar News
News November 25, 2025
నేపాల్లో 8 మంది పామూరు యువకులు అరెస్టు

బెట్టింగుల కోసం దేశాలు దాటి పామూరు యువకులు జైలు పాలైన సంఘటన జరిగింది. వివరాల్లోకెళ్తే.. నేపాల్ దేశంలో జరుగుతున్న ఎన్పీఎల్ క్రికెట్పై ఆన్లైన్లో బెట్టింగ్ కాసేందుకు పామూరుకు చెందిన 8 యువకులు బెంగుళూరు నుంచి విమానం ద్వారా నేపాల్కి చేరుకున్నట్లు సమాచారం. నేపాల్కి వెళ్లెందుకు పాస్పోర్ట్ అవసరం లేకపోవడంతో ఆధార్ కార్డుపై నేపాల్ వెళ్లారు. పోలీసుల పక్కా సమాచారంతో 8 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
News November 25, 2025
ప్రకాశం: సందేహాలు ఉంటే ఈ నంబర్లకు కాల్ చేయండి.!

పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి కిరణ్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని డీఈఓ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. పదవతరగతి ఫీజు చెల్లింపులు, నామినల్ రోల్స్ సమయంలో ఇబ్బందులు ఉన్నయెడల వాటి పరిష్కారానికి స్పెషల్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే 9848527224, 8985601722కు సంప్రదించాలన్నారు.
News November 25, 2025
ప్రకాశం: సందేహాలు ఉంటే ఈ నంబర్లకు కాల్ చేయండి.!

పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి కిరణ్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని డీఈఓ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. పదవతరగతి ఫీజు చెల్లింపులు, నామినల్ రోల్స్ సమయంలో ఇబ్బందులు ఉన్నయెడల వాటి పరిష్కారానికి స్పెషల్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే 9848527224, 8985601722కు సంప్రదించాలన్నారు.


