News April 11, 2025

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం

image

చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు మద్దతు ధర అందించాలని, మహిళా సంఘాలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News November 19, 2025

అంగరంగ వైభవంగా ప్రారంభమైన అనంతుని దీపోత్సవం

image

పద్మనాభంలోని అనంత పద్మనాభుని దీపోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యింది. తొలి పావంచ వద్ద దీపాలను వెలిగించి విశేష అర్చనలు చేశారు. పోలీసులకు ఉత్సవం జరిగే అన్ని ప్రదేశాలలో డ్యూటీలు వేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, సిసి కెమెరాలను, డ్రోన్ కెమెరాను ఆ కేంద్రానికి అనుసంధానం చేశారు. రాత్రికి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంటుందని ఆలయ వర్గాలు తెలిపాయి.

News November 19, 2025

రావులపాలెంలో హిడ్మా అనుచరుడి అరెస్ట్

image

కోనసీమ జిల్లాలో మావోయిస్టు అలజడి రేగింది. నిన్న ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా అనుచరుడు మాధవిహండా సరోజ్‌ రావులపాలెంలో ఉన్నట్లు గుర్తించి పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. అతను రావులపాలెం ఎందుకు వచ్చాడనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

News November 19, 2025

USలో ఏపీ మహిళ హత్య.. బిగ్ ట్విస్ట్

image

APకి చెందిన శశికళ(40), కుమారుడు అనీష్(7) 2017లో USలో హత్యకు గురయ్యారు. భర్తపై అనుమానంతో పోలీసులు అరెస్టుచేసి ఆధారాల్లేక విడిచిపెట్టారు. వారికి హమీద్‌ అనే సహోద్యోగితో గొడవలున్నాయని గుర్తించగా, అప్పటికే అతను INDకు వచ్చేశాడు. అధికారులు DNA శాంపిల్స్ కోరగా తిరస్కరించాడు. అతను పనిచేసిన Cognizant సాయంతో హమీద్ Laptop నుంచి సేకరించిన DNA హత్యాస్థలంతో సరిపోలింది. దీంతో ఇటీవల హమీద్‌ను నిందితుడిగా తేల్చారు.