News February 5, 2025
వరి ధాన్యం సేకరణలో KMR రెండో స్థానం: కలెక్టర్

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కలెక్టరేట్లో ఖరీఫ్ ధాన్యం సేకరణ, చెల్లింపులు CMR సేకరణ, వచ్చే రబీ వరి ధాన్యం సేకరణ ఏర్పాట్ల పై సంబందిత అధికారులతో సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. 424 కేంద్రాల ద్వారా 4.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగిందన్నారు. వరి ధాన్యం సేకరణలో కామారెడ్డి జిల్లా రెండో స్థానంలో నిలిచిందని ఆయన వెల్లడించారు.
Similar News
News November 21, 2025
నిర్మల్ జిల్లాలో దారుణం

జిల్లాలోని సారంగాపూర్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నిర్మల్లోని ఓ ప్రవైటు ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన మృతి చెందింది. చించోలి(బి) గ్రామానికి చెందిన ఓ మహిళ శుక్రవారం మగబిడ్డను ప్రసవించింది. శిశువును శుభ్రం చేస్తుండగా కబోర్డు మీదపడి శిశువు అక్కడికక్కడే మృతి చెందింది. అయితే ఆసుపత్రి నిర్వహకులు ఆ కుటుంబానికి నగదు చెల్లించి సర్దుబాటు చేసుకున్నారని స్థానికులు తెలిపారు.
News November 21, 2025
బాధ్యతలు స్వీకరించిన పార్వతీపురం జిల్లా అదనపు ఎస్పీ

పార్వతీపురం మన్యం జిల్లా నూతన అదనపు ఎస్పీగా ఎం. వెంకటేశ్వరరావు శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా నూతన అదనపు ఎస్పీగా ఎం.వేంకటేశ్వర రావు నియమితులయ్యారు. ఈయన జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. జిల్లాలో శాంతి భద్రతల కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు.
News November 21, 2025
ఓటర్ల జాబితా నిరంతర ప్రక్రియ: కలెక్టర్

ఓటర్ల జాబితా నవీకరణ పారదర్శకంగా నిరంతరంగా కొనసాగుతుందని కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 2002 నుంచి 2005 మధ్యలో నమోదైన ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ కూడా చేపట్టినట్లు చెప్పారు. పెండింగ్లో ఉన్న ఫారం 6లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు.


