News February 5, 2025

వరి ధాన్యం సేకరణలో KMR రెండో స్థానం: కలెక్టర్

image

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కలెక్టరేట్‌లో ఖరీఫ్ ధాన్యం సేకరణ, చెల్లింపులు CMR సేకరణ, వచ్చే రబీ వరి ధాన్యం సేకరణ ఏర్పాట్ల పై సంబందిత అధికారులతో సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. 424 కేంద్రాల ద్వారా 4.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగిందన్నారు. వరి ధాన్యం సేకరణలో కామారెడ్డి జిల్లా రెండో స్థానంలో నిలిచిందని ఆయన వెల్లడించారు.

Similar News

News September 15, 2025

రేపు ఆర్ట్స్ కళాశాలలో సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన సదస్సు

image

హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన సదస్సును మంగళవారం నిర్వహిస్తున్నట్లు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొ.సుంకరి జ్యోతి తెలిపారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమం ఉ.11 గం.కు ఆడిటోరియంలో నిర్వహించబడుతుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

News September 15, 2025

డిజిటల్ ల్యాబ్‌లను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్‌లను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కోరారు. సోమవారం కోదాడలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో కలిసి ఆయన నూతన కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. విద్యార్థులు కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.

News September 15, 2025

విడాకులు తీసుకున్న వారితో నాకు పెళ్లి అనేవారు: మీనా

image

తనపై గతంలో వచ్చిన వార్తలను జగపతి బాబు షోలో సీనియర్ నటి మీనా గుర్తు చేసుకున్నారు. ‘అప్పుల్లో ఉన్నామని తక్కువ రెమ్యునరేషన్ తీసుకోవాలని నిర్మాతలు అడిగేవారు. అలా తీసిన సినిమాలు హిట్ అయ్యాక నన్ను మర్చిపోయేవాళ్లు. వరుస అవకాశాలు ఉన్నప్పటికీ నేను పెళ్లి చేసుకున్నాను. 2022లో భర్తను కోల్పోయాక ఇండస్ట్రీలో ఎవరు విడాకులు తీసుకున్నా నాతో పెళ్లి అని వార్తలొచ్చేవి. అవి చూసినప్పుడు బాధేసేది’ అని చెప్పారు.