News November 30, 2024

వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అన్న పెద్దమనిషి కేసీఆర్ కాదా: సీఎం

image

కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అని రైతులను కించపరిచిన పెద్దమనిషి నేడు రైతుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. రైతు పండుగ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. వరి సాగు చేస్తే రూ.500 బోనస్ ఇస్తామని చెప్పిన మాట మేము నిలబెట్టుకున్నామని అన్నారు. సన్నాలకు రూ.500 బోనస్ రైతుల ఖాతాలలో పడుతుంటే బీఆర్ఎస్ నాయకుల గుండెల్లో గుబులు లేస్తుందని అన్నారు.

Similar News

News October 13, 2025

MBNR: గ్రీవెన్స్ డే.. 11 ఫిర్యాదులు- SP

image

మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ మేరకు 11 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ డి.జానకి వెల్లడించారు. సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో నేరుగా మాట్లాడి, బాధితులకు చట్టపరమైన సహాయం అందించడమే కాకుండా, వారి సమస్యలు త్వరితగతిన పరిష్కరించాల‌ని ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా, పారదర్శక విధానంలో చర్యలు తీసుకోవడమే మా ప్రధాన లక్ష్యం అన్నారు.

News October 13, 2025

MBNR:Police Flag Day.. అప్లై చేసుకోండి ఇలా!

image

ప్రతి ఏడాది ఈనెల 21న నిర్వహించే “పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నామని ఎస్పీ డి.జానకి తెలిపారు.
✒6వ తరగతి-PG విద్యార్థులు
✒అంశం:1.డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర, 2.విద్యార్థులు డ్రగ్స్‌ నుండి ఎలా దూరంగా ఉండగలరు
✒పేరు నమోదుకు లింక్:https://forms.gle/jaWLdt2yhNrMpe3eA
✒వ్యాసాన్ని పేపర్‌పై రాసి.. ఫోటో/ PDFలో (500 పదాలు మించకూడదు) అప్‌లోడ్ చేయాలి
✒చివరి తేదీ:OCT 28

News October 13, 2025

MBNR: దీపావళి.. నియమాలు తప్పనిసరి:SP

image

దీపావళి సందర్భంలో టపాసుల విక్రయదారులు తప్పనిసరిగా చట్టపరమైన నియమాలను పాటించాలని జిల్లా ఎస్పీ డి.జానకి అన్నారు. టపాసుల విక్రయ దుకాణాలు రద్దీ ప్రదేశాలు, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, పెట్రోల్ బంకులు సమీపంలో అలాగే వివాదాస్పద స్థలాలలో ఏర్పాటు చేయరాదన్నారు. ప్రజలు భద్రతా నియమాలు పాటిస్తూ.. పిల్లలను పెద్దల పర్యవేక్షణలో టపాసులు కాల్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.