News November 30, 2024

వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అన్న పెద్దమనిషి కేసీఆర్ కాదా: సీఎం

image

కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అని రైతులను కించపరిచిన పెద్దమనిషి నేడు రైతుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. రైతు పండుగ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. వరి సాగు చేస్తే రూ.500 బోనస్ ఇస్తామని చెప్పిన మాట మేము నిలబెట్టుకున్నామని అన్నారు. సన్నాలకు రూ.500 బోనస్ రైతుల ఖాతాలలో పడుతుంటే బీఆర్ఎస్ నాయకుల గుండెల్లో గుబులు లేస్తుందని అన్నారు.

Similar News

News November 18, 2025

MBNR: పీయూలో “నషా ముక్త్ భారత్ అభియాన్”

image

పాలమూరు విశ్వవిద్యాలయం విద్యా కళాశాలలో “నషా ముక్త్ భారత్ అభియాన్” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి తన సందేశంలో యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ మాళవి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ అనురాధ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

News November 18, 2025

బాలానగర్: ఫోన్‌పే చేస్తే.. ఖాతాలో రూ.28 వేలు మాయం

image

బాలానగర్ మండలం ఉడిత్యాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కిరాణా షాపులో ఫోన్‌పే ద్వారా రూ.1,260 పంపగా.. కొద్దిసేపటికి అతని ఖాతాలో ఉన్న రూ.28 వేలు మాయమయ్యాయి. దీంతో అవాక్కైన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై కేసు నమోదు చేశారు. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఎస్సై సూచించారు.

News November 18, 2025

బాలానగర్: ఫోన్‌పే చేస్తే.. ఖాతాలో రూ.28 వేలు మాయం

image

బాలానగర్ మండలం ఉడిత్యాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కిరాణా షాపులో ఫోన్‌పే ద్వారా రూ.1,260 పంపగా.. కొద్దిసేపటికి అతని ఖాతాలో ఉన్న రూ.28 వేలు మాయమయ్యాయి. దీంతో అవాక్కైన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై కేసు నమోదు చేశారు. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఎస్సై సూచించారు.