News February 4, 2025
వర్గల్ విద్యాధరి క్షేత్రంలో ఉత్సవాలు విజయవంతం

ప్రసిద్ధ వర్గల్ విద్యాధరి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు 50 వేలకు పైగా సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. వసంత పంచమి పురస్కరించుకొని సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో పదివేలకు పైగా భక్తులు పాల్గొని చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఉత్సవాలను విజయవంతం చేసిన వారికి ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర్ శర్మ సిద్ధాంతి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News December 6, 2025
HYDలో పెరిగిన పాదచారుల ‘రోడ్కిల్’

HYDలో ఫుట్పాత్ల లేమి, ఆక్రమణల కారణంగా పాదచారుల మరణాలు పెరుగుతున్నాయి. 2024లో సుమారు 400 మంది మరణించగా, 1,032 ప్రమాదాలు జరిగాయి. 2025లో ఇప్పటి వరకు 510 మరణాలకు ఇదే కారణం. ఐటీ కారిడార్లలో సైతం కిలోమీటరుకు సగటున 7 అడ్డంకులు ఉండటంతో ఉద్యోగులు నడవలేకపోతున్నారు. 7,500 స్టాల్స్ తొలగించినా, సమస్య పరిష్కారం కాలేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది.
News December 6, 2025
అంబేడ్కర్ గురించి ఈ విషయాలు తెలుసా?

*విదేశాల్లో ఎకనామిక్స్లో PhD చేసిన తొలి భారతీయుడు
*కొలంబియా యూనివర్సిటీలో ఎకనామిక్స్లో 29, హిస్టరీలో 11, సోషియాలజీలో 6, ఫిలాసఫీలో 5, ఆస్ట్రాలజీలో 4, పాలిటిక్స్లో 3 కోర్సులు చేశారు
*1935లో ఆర్బీఐ ఏర్పాటులో కీలకపాత్ర
*అంబేడ్కర్ పర్సనల్ లైబ్రరీలో 50వేల పుస్తకాలు ఉండేవి
*దేశంలో పనిగంటలను రోజుకు 14 గం. నుంచి 8 గం.కు తగ్గించారు
>ఇవాళ అంబేడ్కర్ వర్ధంతి
News December 6, 2025
KMR: బుజ్జగింపు పర్వం సక్సెస్ అయ్యేనా?

KMR జిల్లాలో 2వ విడత నామినేషన్ల ఉపసంహరణకు కౌంట్డౌన్ మొదలైంది. ప్రధాన పార్టీలకు సొంత పార్టీ రెబల్స్, స్వతంత్ర అభ్యర్థుల నుంచి ముప్పు పొంచి ఉంది. వారిని బుజ్జగించి పోటీ నుంచి తప్పించేందుకు బడా నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే ఈ రణరంగంలో ఉండేదేవరు? ఊడేదెవరు అన్నది పలు చోట్ల ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రెబల్స్ బెట్టు వీడతారా? లేక ఇండిపెండెంట్గా సై అంటారా? ఇవాళ సాయంత్రం వరకు ఈ ఉత్కంఠ తప్పదు!


