News February 4, 2025

వర్గల్ విద్యాధరి క్షేత్రంలో ఉత్సవాలు విజయవంతం

image

ప్రసిద్ధ వర్గల్ విద్యాధరి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు 50 వేలకు పైగా సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. వసంత పంచమి పురస్కరించుకొని సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో పదివేలకు పైగా భక్తులు పాల్గొని చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఉత్సవాలను విజయవంతం చేసిన వారికి ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర్ శర్మ సిద్ధాంతి కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News February 18, 2025

ఆక్వా రంగం గ్రోత్ ఇంజిన్ కావాలి: CM చంద్రబాబు

image

AP: రాష్ట్రానికి ఆక్వా రంగం గ్రోత్ ఇంజిన్ కావాలని CM చంద్రబాబు అన్నారు. టెక్నాలజీ వినియోగంతో 30% వృద్ధి సాధ్యమే అని చెప్పారు. ప్రకృతి సాగు ఆక్వా ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉందని తెలిపారు. సీడ్, ఫీడ్‌లో జాగ్రత్తలు తీసుకుంటూ యాంటీబయాటిక్స్‌ తగ్గించాలని సూచించారు. 10లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు లక్ష్యం దిశగా రైతులను ప్రోత్సహిస్తామని GFST ఆక్వాటెక్ 2.0 కాన్‌క్లేవ్‌లో CM వెల్లడించారు.

News February 18, 2025

రక్తాన్ని అందుబాటులో ఉంచుతాం: నంద్యాల కలెక్టర్

image

అత్యవసర వైద్యం కోసం నంద్యాలకు వచ్చే వారి కోసం రెడ్‌క్రాస్ ద్వారా రక్తం అందుబాటులో ఉంచుతామని నంద్యాల కలెక్టర్ జి.రాజకుమారి పేర్కొన్నారు. కేసీ కెనాల్ కాంపౌండ్‌లోని మైనర్ ఇరిగేషన్ కార్యాలయ సమూహంలో ఏర్పాటు చేయబోయే రెడ్ క్రాస్ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ భవనాన్ని కలెక్టర్ పరిశీలించారు. అక్కడి ఇంజనీర్లు, కమిటీ సభ్యులకు ఆమె పలు సూచనలిచ్చారు.

News February 18, 2025

గంగారంలో ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

ఇంట్లో ఎవరూలేని సమయంలో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సత్తుపల్లి మండలం గంగారంలోని జలగం నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కంచి రాధాకృష్ణ (30) గ్రామంలోని ఓ హోటల్లో పనిచేస్తుండగా ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం సత్తుపల్లి తరలించారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. రాధాకృష్ణ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!