News February 27, 2025

వర్గల్: వివాహేతర సంబంధంతో మహిళ హత్య

image

వర్గల్ మండలం అనంతగిరిపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ(40)తో అదే గ్రామానికి చెందిన బండ్ల చిన్న లక్ష్మయ్య మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈనెల 15న గజ్వేల్ పరిధిలోని కోమటిబండ అటవీ ప్రాంతంలోకి మహిళను తీసుకెళ్లి పురుగు మందు కలిపిన కల్లు తాగించాడు. ఆ తరువాత మెడకు చీరతో ఉరేసి చంపినట్లు గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి వివరాలను వెల్లడించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Similar News

News November 7, 2025

కొత్తగూడెం: సింగరేణి డిపెండెంట్లకు శుభవార్త

image

ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్ కృషితో సింగరేణి కారుణ్య నియామక అభ్యర్థులకు శుభవార్త అందింది. మెడికల్ టెస్టులు పూర్తయి ఇప్పటివరకు నియామక పత్రాలు పొందని దాదాపు 473 మంది డిపెండెంట్లకు ఈ నెల 12న డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నట్లు యూనియన్ నాయకులు తెలిపారు. దీని ద్వారా సింగరేణి వ్యాప్తంగా 473 కార్మిక కుటుంబాలకు న్యాయం జరగనుంది.

News November 7, 2025

సినిమా అప్డేట్స్

image

* మమ్ముట్టి నటించిన ‘భ్రమయుగం’ అరుదైన ఘనత సాధించింది. లాస్‌ఏంజెలిస్‌లోని ‘అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్’లో వచ్చే ఏడాది FEB 12న ప్రదర్శితమవనుంది.
* పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించిన ‘విలాయత్ బుద్ధ’ మూవీ ఈ నెల 21న రిలీజవనుంది.
* దివంగత మైఖేల్ జాక్సన్ జీవితం ఆధారంగా హాలీవుడ్‌లో ‘మైఖేల్’ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో ఆయన సోదరుడు జెర్మైన్ జాక్సన్ కుమారుడు జాఫర్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు.

News November 7, 2025

పెరిగిన ఓటింగ్.. మార్పుకు సంకేతమా..?

image

బిహార్ తొలిదశ ఎన్నికల్లో 20 ఏళ్లలో తొలిసారి 64.66% ఓటింగ్ శాతం పెరగడంపై పార్టీల్లో చర్చ జరుగుతోంది. భారీ ఓటింగ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే సంకేతమని ప్రశాంత్ కిషోర్ అంటున్నారు. అధికారపక్షంపై అసహనం, ఆగ్రహం అధికంగా ఉంటే ఓటర్లూ అదేస్థాయిలో పోలింగ్ స్టేషన్లకు వస్తారన్నారు. 1998సం.లో (MP ఎన్నికలు) తొలిసారి 64%, 2000లో 62% ఓటింగ్ నమోదవగా అప్పుడు అధికార బదిలీ జరిగింది. ఈసారి ఇది రిపీటవుతుందా?